Saturday, March 14, 2026
HomeTrending Newsపవన్ కళ్యాణ్ కు మహిళా కమిషన్ నోటీసు

పవన్ కళ్యాణ్ కు మహిళా కమిషన్ నోటీసు

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన మూడు పెళ్ళిళ్ళ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆంధ్ర ప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలు సమాజంలో పెద్ద దుమారం లేపాయని, భరణం ఇస్తే భార్యను వదిలిన్చుకోవచ్చనే విధంగా మీరు ఇచ్చిన సందేశంతో మహిళా లోకం షాక్ కు గురైందని పేర్కొన్నారు. ఈ మేరకు మహిళా కమిషన్ పవన్ కల్యాణ్ కు నోటీసు జారీ చేసింది.  మాటల్లో తప్పు తెలుసుకొని పశ్చాత్తాపం వ్యక్తం చేస్తారని ఇన్ని రోజులూ మహిళా కమిషన్ ఎదురు చూసిందని, అయినా సరే  ఆ వ్యాఖ్యలపై సంజాయిషీ ఇవ్వలేదని, క్షమాపణలు కూడా చెప్పలేదని ఆమె అభ్యంతరం తెలిపారు.

పవన్ తన ప్రసంగంలో స్టెప్నీ అనే పదం ఉపయోగించడం తీవ్రఆక్షేపణీయమని, మహిళను భోగ వస్తువుగా, అంగడి సరుకుగా భావించేవారు ఇలాంటి పదాలు వాడతారని ఆమె తీవ్రంగా వ్యాఖ్యానించారు.  ఈ వ్యాఖ్యలపై ఎందరో మహిళలకు తమకు ఫిర్యాదు చేశారని, తక్షణమే దీనిపై క్షమాపణ చెప్పి, వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని పద్మ సూచించారు.

Also Read : వైసీపీ ముక్త ఆంధ్ర ప్రదేశ్ మా నినాదం : పవన్ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular