Saturday, September 21, 2024
HomeTrending NewsBus Accident: పాడేరు ఘాట్ రోడ్డులో ప్రమాదం- ఇద్దరి మృతి

Bus Accident: పాడేరు ఘాట్ రోడ్డులో ప్రమాదం- ఇద్దరి మృతి

అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా  పాడేరు ఘాట్ రోడ్డు లో జరిగిన బస్సు ప్రమాదంలో  ఇద్దరు మృతి చెందారు.  పాడేరు ఘాట్ రోడ్డు వ్యూపోయింట్ వద్ద  ఆర్టీసీ బస్సు అదుపు తప్పి 100 అడుగుల లోయలో పడిపోయింది.  ఈ బస్సు  పాడేరు నుండి చోడవరం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 60 మంది ప్రయాణికులు ఉన్నారు.  వీరిలో ఇద్దరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

కాగా, ఈ ప్రమాద ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనా స్థలికి వెళ్లాల్సిందిగా  అల్లూరి , అనకాపల్లి, విశాఖపట్నం జిల్లా కలెక్టర్లను సిఎం ఆదేశించారు. క్షతగాత్రులకు మంచి ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయా జిల్లాల పోలీసు యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు.  బాధిత కుటుంబాలకు తోడుగా నిలవాలని, ఘటనకు దారితీసిన కారణాలపై అధికారులు దృష్టిసారించాలని సూచించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్