Friday, September 20, 2024
HomeTrending NewsCM Tributes: జీవితాన్ని ప్రజలకే అంకితం చేసిన టంగుటూరి

CM Tributes: జీవితాన్ని ప్రజలకే అంకితం చేసిన టంగుటూరి

ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు, ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి 152వ జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరిస్తూ, ఘననివాళులు.

స్వాతంత్య్ర సమరయోధులు, ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. తాడేపల్లిలోని సిఎం క్యాంప్‌ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.  ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జోగి రమేష్, ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి పాల్గొన్నారు.

“స్వాతంత్య్ర  సమరయోధుడిగా, ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు గారు రాష్ట్రానికి, దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనలో ఆయన పాత్ర కీలకం. తన జీవితాన్ని ప్రజా సేవకు అంకితం చేసిన ఆ మహనీయుడు ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా నివాళులు”అంటూ సిఎం జగన్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్