Friday, October 18, 2024
HomeTrending Newsషర్మిలమ్మకు అండగా ఉంటా

షర్మిలమ్మకు అండగా ఉంటా

ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 5 ఎంపి, 25 ఎమ్మెల్యే సీట్లు గెలిపిస్తే విభజన హామీలు సాధించి చూపిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.  బీజేపీ అంటే బాబు, జ‌గ‌న్‌, ప‌వ‌న్‌ అని ఈ ముగ్గురూ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో విఫలమయ్యారని ఆరోపించారు. వైఎస్సార్ కు నిజమైన వారసురాలు వైఎస్ షర్మిల మాత్రమేనని అన్నారు. విశాఖపట్నం  స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన న్యాయ సాధన సభకు రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడిన ముఖ్యాంశాలు:

  • ఈ సభ ను చూస్తుంటే నేను విశాఖ లో ఉన్నట్లు లేదు. నాకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సభ పెట్టినట్లు ఉంది
  • ఇక్కడకు వద్దాం అనుకున్నప్పుడు కాంగ్రెస్ ఏపిలో లేదు అని అన్నారు.
  • అక్కడకు పోతే కాంగ్రెస్ పరువు పోతుంది ఏమో అని అన్నారు
  • నేను వైఎస్సార్ బిడ్డ షర్మిల సభ పెడితే ఎలా ఉటుందో చెప్పా
  • ఇక్కడ సభ చూస్తే షర్మిల న్యాయకత్వం ఎలా ఉందో అర్ధం అవుతుంది
  • మనం భౌగోళికంగా రెండు రాష్ట్రాలుగా విడిపోయాం
  • డిల్లీ నుంచి సుల్తాన్ లు,జగిర్ధార్ లు వచ్చినా విశాఖ ఉక్కు పెళ్ళ కూడా పెకిలించలేరు
  • ఆనాడు కురుక్షేత్రం లో కౌరవులు, పాండవులు వేరు వేరు
  • కానీ వాళ్ళ మీదకు ఎవరైనా వస్తే అందరూ ఒకటయ్యే వారు
  • వైఎస్సార్ వారసులు ఎవరు అనేది అపోహలు, అనుమానాలు ఉండొచ్చు.
  • వైఎస్సార్ సంకల్పాన్ని నిలబెట్టే వాళ్ళే నిజమైన వారసులు
  • వైఎస్సార్ ఆశయాలకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు వైఎస్సార్ వారసులు ఎలా అవుతారు ఆలోచన చేయాలి
  • ఆంధ్ర ప్రాంతంలో ప్రశ్నించే గొంతులు లేరు. డిల్లీ నుంచి మోడీ ఆంధ్ర ను పాలిస్తున్నాడు అంటే ఇక్కడ ప్రశ్నించే గళం ఇంతవరకు లేదు

  • 10 ఏళ్లు అయినా పోలవరం కట్టలేదు. రాజధాని కట్టలేదు
  • తెలుగు ప్రజల ఆత్మగౌరవం ఢిల్లీలో తాకట్టు పెట్టారు
  • తెలుగు రాష్ట్రాల నుంచి మన ఖ్యాతిని  పెంచేలా ఢిల్లీని ఎందరో శాసించారు
  • ఇవ్వాళ రెండు రాష్ట్రాల్లో నాయకులు ఢిల్లీలో వంగి వంగి దండాలు పెట్టే వాళ్ళే ఉన్నారు
  • కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో వైఎస్సార్ ను రంగంలో దింపింది
  • చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురం వరకు పాదయాత్ర చేశాడు
  • 105 డిగ్రీల జ్వరం వచ్చినా పాదయాత్ర ను అపలేదు. అన్ని వర్గాల ప్రజల సమస్యలు తెలుసుకున్నాడు
  • 2004 లో కాంగ్రెస్ ను అధికారంలో తెచ్చాడు, 33 మంది ఎంపీలను గెలిపించారు
  • అనాడు వైఎస్సార్ మొక్కవోని దీక్షతోనే ఇటు రాష్ట్రంలో,అటూ కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో వచ్చింది
  • అధికారంలో వచ్చిన వెంటనే 12 వందల కోట్ల రూపాయల కరెంట్ బిల్లులను మాఫీ చేశాడు
  • రాజీవ్ అరోగ్య శ్రీ పథకంతో అపోలో,యశోద లాంటి కార్పొరేట్ లో వైద్యం అందించాడు
  • శ్రిమంతుల పిల్లలతో పోటీ పడేలా పేద బిడ్డలకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం తీసుకు వచ్చాడు
  • జలయజ్ఞం సృష్టికర్త వైఎస్సార్. పోలవరం,హంద్రీనీవా లాంటి ప్రాజెక్టులు జలయజ్ఞం పుణ్యమే
  • హైదరాబాద్ అభివృద్ధి లో వైఎస్సార్ కీలక పాత్ర
  • ప్రాణహిత – చేవెళ్ల వైఎస్సార్ మొదలు పెట్టిన ప్రాజెక్ట్
  • రాష్ట్రాలుగా విడిపోయాం. తెలుగు బిడ్డలు గా కలిసి ఉండాలే.
  • బీజేపీ అంటే ఇవ్వాళ బాబు,జగన్,పవన్.  వీళ్ళు మోడీ భలం,భలగం.
  • వీళ్లకు ఓటేస్తే మోడీకి ఓటు వేసినట్లే. ఢిల్లీలో మోడీ నీ నిలదీసే దమ్ము లేదు.
  • అంతా ముత్యాల ముగ్గు బ్యాచ్.

  • బాబు, జగన్ కేవలం పాలన కోసమే. రాష్ట్ర హక్కుల కోసం కోట్లాడే వాళ్ళు కాదు
  • ఈ రాష్ట్రానికి ప్రశ్నించే గొంతు కాంగ్రెస్. షర్మిలమ్మ అన్ని ఆలోచనలు చేసి ఇక్కడకు వచ్చింది
  • నన్ను అడిగింది.నేను ఎందుకు అని అడిగిన
  • అక్కడ ప్రజలు కష్టాల్లో ఉన్నారు..నేను నిర్ణయం తీసుకున్న అని చెప్పింది
  • నాకు వయసు ఉంది..శక్తి ఉంది వాళ్ళకోసం పోరాటం చేస్తా అని చెప్పింది
  • వైఎస్సార్ బిడ్డగా,ఆయన వారసురాలు గా ఎక్కడ పోగొట్టుకున్నమో అక్కడ నుంచే మొదలు పెడతా అని చెప్పింది
  • ఆంధ్ర ప్రదేశ్ గడ్డ మీద జెండా పాతుతం అని చెప్పారు
  • షర్మిలమ్మ కి ఇక్కడ అన్ని తెలుసు
  • ఇక్కడ ఉన్నవి అంబోతులు అని తెలుసు.
  • అన్ని తెలిసే ఇక్కడ పోరాటం చేయాలని వచ్చింది
  • విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా చూడటానికి వచ్చింది
  • అదానీ కోసం ప్రధాని తెగనమ్ముతుంటే పోరాటం చేయడానికి వచ్చింది
  • అప్పనంగా అధికారం కోసం షర్మిలమ్మ ఇక్కడకు రాలేదు
  • ఇక్కడ ప్రజలకు అండగా నిలబడేందుకు వచ్చింది
  • రాహుల్ ప్రధాని అవ్వాలన్నది వైఎస్సార్ చివరి కోరిక
  • వైఎస్సార్ ఏ రోజు బీజేపీ తో అంట కాగలేదు. బీజేపీ కి వైఎస్సార్ ఎప్పుడు బద్ద వ్యతిరేకి
  • కష్టం వచ్చినా కాంగ్రెస్ పక్షాన వైఎస్సార్ నిలబడ్డాడు
  • వైఎస్సార్ ఒక సెక్యులర్. వారసులు అని చెప్పుకొనే వాళ్ళు ఇవ్వాళ ఎవరి పక్కన నిలబడ్డాడు ఆలోచన చేయాలి
  • ఎవరి ఆశయం కోసం కొట్లాడుతున్నారో చెప్పాలి
  • మోడికి అండగా నిలబడి..ఈ రాష్ట్రాన్ని ఒక కమ్యునల్ చేతుల్లో పెట్టాలని అనుకున్నారా ?
  • మణిపూర్ లో అరాచకం జరుగుతుంటే వైఎస్సార్ వారసుడు ఎందుకు మాట్లాడలే..
  • వైఎస్సార్ అంటే వైఎస్ షర్మిల. వైఎస్సార్ వారసురాలు ఒక షర్మిల మాత్రమే
  • వైఎస్సార్ ఆశయాలు షర్మిలమ్మ దగ్గరే ఉన్నాయి
  • బాబు కి,జగన్ కి మోడీ నీ ప్రశ్నించే దమ్ము లేదు
  • రాష్ట్రానికి ప్రశ్నించే గొంతు వైఎస్ షర్మిలా రెడ్డి
  • మీ నిధులు మీకు తీసుకు వస్తుంది
  • మీ పథకాలు మీ ఇంటికి వస్తాయి
  • రాష్ట్ర హక్కులు షర్మిలమ్మ తోనే సాధ్యం
  • తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఖతం అన్నారు. అక్కడ ఉన్న కేడి, ఢిల్లీలో ఉన్న మోడీనీ ఎదుర్కొన్నా
  • అప్పుడు నేను అధైర్య పడలేదు. 5 సీట్లు ఉన్న కాంగ్రెస్ కి 65 సీట్లు ఇచ్చి నిలబెట్టారు
  • ఇక్కడ కాంగ్రెస్ నిలబెట్టేందుకు షర్మిలమ్మ పోరాటం చేస్తోంది
  • షర్మిలమ్మ కి నేను అండగా నిలబడతా
  • షర్మిలమ్మ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసే వరకు నేను అండగా ఉంట
  • ఏ అవసరం వచ్చినా ముందు ఉంట
RELATED ARTICLES

Most Popular

న్యూస్