Saturday, March 14, 2026
Homeసినిమాఅక్టోబర్ 1న ‘అసలేం జరిగిందంటే...?

అక్టోబర్ 1న ‘అసలేం జరిగిందంటే…?

ఒక ట్రయాంగిల్ లవ్ స్టొరీతో సస్పెన్స్ థ్రిల్లర్ గా  రూపొందిన ‘అసలు ఏం జరిగిందంటే’ అక్టోబరు 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. పెదరాయుడు, ఆహా, పెళ్లి చేసుకుందాం, దేవి” తదితర సూపర్ హిట్ సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా.. మొన్న వచ్చిన ‘మాస్టర్’ లో విజయ్ సేతుపతికి చిన్నప్పటి కారెక్టర్ తో మెప్పించిన మాస్టర్ మహేంద్రన్ కథానాయకుడిగా.. శ్రీ పల్లవి, కారుణ్య చౌదరి, కరోణ్య కత్రిన్ హీరోయిన్లుగా, ‘రమణా లోడెత్తాలిరా’ ఫేమ్ కుమనన్ సేతురామన్, హరితేజ, షఫీ, షాని సాల్మన్, జబర్దస్త్ ఫణి, దొరబాబు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా కుటుంబ సమేతంగా చూసి ఆనందించేలా ఉంటుందని, అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని చిత్ర రచయిత & దర్శకుడు శ్రీనివాస్ బండారి తెలియ జేశారు.

జి.ఎస్.ఫిలిమ్స్ వారు నిర్మించిన ఈ చిత్రాన్ని ఏ.బి.ఆర్.ప్రొడక్షన్స్ ద్వారా అనిల్ బొద్దిరెడ్డి సమర్పిస్తున్నారు. ఎమ్.జి.ఎమ్ ఫిలిమ్స్ వారు ఈ చిత్రాన్ని తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ లో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: కర్ణ ప్యారసాని, సాహిత్యం-సంగీతం: చరణ్ అర్జున్, కూర్పు: జె.ప్రతాప్ కుమార్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: షాని సాల్మన్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular