Saturday, September 28, 2024
Homeసినిమామ‌హేష్‌, త్రివిక్ర‌మ్ మూవీ సెట్స్ పైకి ఎప్పుడు?

మ‌హేష్‌, త్రివిక్ర‌మ్ మూవీ సెట్స్ పైకి ఎప్పుడు?

Mahesh-Trivikram: సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘స‌ర్కారు వారి పాట‌‘. ఈ చిత్రానికి ‘గీత గోవిందం’ ఫేమ్ ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మ‌హేష్ స‌ర‌స‌న మ‌ల‌యాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ న‌టిస్తోంది. ఈ భారీ చిత్రం ఎప్పుడో ప్రేక్ష‌కుల ముందుకు రావాల్సింది కానీ.. క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డింది. ఒక పాట మిన‌హా షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వ‌ర‌లోనే మిగిలిన ఆ పాట‌ను చిత్రీక‌రించేందుకు ప్లాన్ చేస్తున్నారు. మే 12న స‌ర్కారు వారి పాట చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు.

ఈ సినిమా త‌ర్వాత మ‌హేష్ బాబు.. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ తో సినిమా చేయ‌నున్నారు. ఈ భారీ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లాలి కానీ.. ఇప్ప‌టి వ‌ర‌కు స్టార్ట్ కాలేదు. క‌రోనా ఓ కార‌ణ‌మైతే… మ‌హేష్ మోకాలికి స‌ర్జ‌రీ చేయించుకోవ‌డం మ‌రో కార‌ణం. ఆమ‌ధ్య త్రివిక్ర‌మ్ త‌మ‌న్ తో క‌లిసి ఈ సినిమా కోసం మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ చేశారు.

ఆత‌ర్వాత నుంచి ఎలాంటి అప్ డేట్ లేదు. తాజా వార్త ఏంటంటే.. సర్కారు వారి పాట విడుదలైన వెంటనే మహేష్ బాబు వెకేషన్ కి వెళ్తారు. జూన్ లో తిరిగి హైదరాబాద్ వస్తారు. ఒక నెల గ్యాప్ తర్వాత షూటింగ్ కి సిద్ధమవుతారు. అంటే మహేష్ బాబు,  త్రివిక్రమ్ కొత్త మూవీ షూటింగ్ జులైలో మొదలు కానుంది. పూజ హెగ్డేని హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. ఆమెని కూడా జులై నుంచి డేట్స్ అడిగినట్లు సమాచారం. రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలైనా, ఏడు నెలల్లో దాన్ని పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు త్రివిక్రమ్. మ‌రి.. అత‌డు, ఖ‌లేజా చిత్రాల‌తో మెప్పించిన మ‌హేష్‌, త్రివిక్ర‌మ్ ఈసారి ప్రేక్ష‌కుల‌ను ఎంత వ‌ర‌కు మెప్పిస్తారో చూడాలి.

Also Read : స‌ర్కారు మూడో పాట‌కు ముహుర్తం కుదిరిందా?

RELATED ARTICLES

Most Popular

న్యూస్