Friday, September 20, 2024
Homeసినిమాప‌వ‌ర్ స్టార్, సురేంద‌ర్ రెడ్డి మూవీ ఏమైంది?

ప‌వ‌ర్ స్టార్, సురేంద‌ర్ రెడ్డి మూవీ ఏమైంది?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ‘వ‌కీల్ సాబ్’, ‘భీమ్లా నాయ‌క్’ చిత్రాల‌తో వ‌రుస‌ స‌క్సెస్ లు సాధించి సెన్సేష‌న్ క్రియేట్ చేశారు. ప్ర‌స్తుతం ‘హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు‘ మూవీ చేస్తున్నారు. దీనికి క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. స‌మ్మ‌ర్ లో ఈ సినిమాని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. రెండు సంవ‌త్స‌రాల క్రితం ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ఓ భారీ చిత్రం చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఈ చిత్రాన్ని రామ్ తాళ్లూరి నిర్మించ‌నున్నారని  ప్ర‌క‌ట‌న అయితే వ‌చ్చింది కానీ.. అప్ప‌టి నుంచి ఎలాంటి అప్ డేట్ బ‌య‌ట‌కు రాలేదు. దీంతో అస‌లు ఈ ప్రాజెక్ట్ ఉందా, లేదా అనే అనుమానాలు మొద‌ల‌య్యాయి. ఒకానొక ద‌శ‌లో ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింద‌ని ప్ర‌చారం కూడా జ‌రిగింది.

అయితే.. ప‌వ‌ర్ స్టార్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా రామ్ తాళ్లూరి సోష‌ల్ మీడియాలో క్లారిటీ ఇచ్చారు. ప్ర‌స్తుతం సురేంద‌ర్ రెడ్డి అఖిల్ తో ఏజెంట్ అనే భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తైన త‌ర్వాత ప‌వ‌న్, సురేంద‌ర్ రెడ్డి కాంబోలో మూవీ ఉంటుంద‌ని క్లారిటీ ఇచ్చారు.

Also Read: హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు‘ ప్రచార చిత్రం విడుదల

RELATED ARTICLES

Most Popular

న్యూస్