Wednesday, September 25, 2024
HomeTrending Newsహ్యాపీరావుతో ముప్పు - రేవంత్ సంచలన వ్యాఖ్యలు

హ్యాపీరావుతో ముప్పు – రేవంత్ సంచలన వ్యాఖ్యలు

బీజేపీ,టీఆరెస్ ఇద్దరి మధ్య వైరుధ్యం ఉన్నట్లు ప్రజల్ని నమ్మించాలని చూస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ అవినీతిపై విచారణ చేసి ఊచలు లెక్కబెట్టిస్తామని బీజేపీ చెబుతోందని, ప్రజలు కూడా వారి మాటలను నమ్మే పరిస్థితి దాపురించిందన్నారు. సీబీఐ, ఈడీ తమను వేధిస్తూన్నాయని కేటీఆర్ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ ఈ రోజు హైదరాబాద్ లో  విమర్శించారు. తెలంగాణలో బీజేపీ, టీఆరెస్ మధ్య యుద్ధ వాతావరణం ఉన్నట్లు అపోహలు కల్పిస్తున్నారని అన్నారు. మోదీ, అమిత్ షా, కేంద్ర మంత్రులు కేసీఆర్ దోపీడిని ప్రస్తావిస్తున్నారని అయితే అది వాస్తవం కాదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

రేవంత్ రెడ్డి ఆరోపణలు ఆయన మాటల్లోనే

ఢిల్లీ హైకోర్టులో నేను సంపూర్ణ వివరాలతో ప్రజా ప్రయోజన వ్యాజ్యము వేశాను. 2018లో ఎలక్షన్ కమిషన్ కు ఢీల్లీ హైకోర్టు అదేశాలిచ్చింది. గతంలో గులాబీ కూలీ పేరుతో నిధులు వసూలు చేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్రం నలుమూలలా వందలాది కోట్లు వసూలు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు నిధులను వసూలు చేయడం నేరం. అలాంటి వసూళ్లు లంచం తీసుకోవడంతో సమానం. ఈ విషయంపై ఏసీబీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. పార్టీ చందాలు వసూలు చేశారని కేసును క్లోజ్ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘ నియామవళి ప్రకారం 20వేల కంటే ఎక్కువ నగదు రూపంలో చందాలు తీసుకోవద్దు. 20వేల కంటే ఎక్కువ ఖర్చు చేయొద్దు. గులాబీ కూలీ పేరుతో వసూలు చేసిన నిధుల వివరాలు ఎన్నికల సంఘానికి అందించలేదు

ఎన్నికల సంఘం నియమావళిని కేసీఆర్ ఉల్లంఘించారు. దీనిపై నేను ఎన్నికల సంఘాన్నీ కలిసి చర్యలు తీసుకోవాలని కోరాను. వసూళ్లపై విచారణకు సిబ్బంది లేదని ఎన్నికల సంఘం తెలిపింది. విచారణ కోసం సీబీడీటీ చైర్మన్ కు లేఖ రాసింది. ప్రధానికి పిర్యాదు చేస్తే.. హోంమంత్రికి పంపించారు. నేను ఎంపీ అయిన తర్వాత మళ్ళీ సీబీడీటీ కి ఫిర్యాదు చేశా. ఐదేళ్లుగా వందల కోట్లు వసూలు చేస్తున్న ఆర్థిక నేరగాళ్లు.

కేసీఆర్ ఒక ఆర్ధిక ఉగ్రవాది. ఆయనపై కేంద్రప్రభుత్వం ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోవడంలేదు. సరైన చర్యలు తీసుకుంటే టీఆరెస్ పార్టీ రద్దు అవుతుంది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేస్తే టీఆరెస్ కుక్కలు చించిన విస్తరి అవుతుంది. అందుకే టీఆరెస్ ను బీఆరెస్ గా మార్చుకుంటున్నారు. వ్యూహాత్మకంగానే కేసీఆర్ పార్టీ పేరు మారుస్తున్నారు. బీజేపీ సహకారంతో చర్యల నుంచి తప్పించుకుంటున్నారు. వెస్ట్ బెంగాల్ లాంటి పరిస్థితులను తెలంగాణలో సృష్టిస్తున్నారు. ప్రతిపక్ష హోదాను బీజేపీ కి ఇప్పించడానికే టీఆరెస్, బీజేపీ డ్రామాలు. ఈ దుశ్చర్యలను తెలంగాణ సమాజం గమనించాలి

ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను అమలు చేయకుండా ఎవరు అడ్డుకుంటున్నారో  చెప్పాలి. రెండు రాజకీయ పార్టీల రాక్షస క్రీడలో భాగమే నిన్న కేటిఆర్ ప్రకటన. దిక్కుమాలిన ప్రకటనల వెనక టీఆరెస్ బీజేపీ అంతర్గతంగా ఒప్పందం ఉంది. కాంగ్రెస్ ను ఖతం చేయడానికే వారి వీధి నాటకాలు. నా పిటిషన్ ను విచారణ జరిపే వరకు టీఆరెస్ పెరు మార్చడానికి వీల్లేదు. ఈ విషయంపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేస్తా. రాజ్యసభలో తెరాస ఫ్లోర్ బీజేపీలో విలీనం అవ్వబోతుంది. ప్రగతి భవన్ లో ఉండి ప్రగతి సాధించిన హ్యాపీరావు నేతృత్వంలో అది జరగనుంది. కేటీఆర్ ఆ సంగతి చూసుకుంటే బాగుంటుందని రేవంత్ రెడ్డి హితవు పలికారు.

Also Read : తెలంగాణ హంతకుడు కెసిఆర్  రేవంత్ రెడ్డి విమర్శ

RELATED ARTICLES

Most Popular

న్యూస్