Thursday, September 19, 2024
Homeసినిమా'ప్రాజెక్ట్ కే' ఇంట్రస్టింగ్ అప్ డేట్

‘ప్రాజెక్ట్ కే’ ఇంట్రస్టింగ్ అప్ డేట్

ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ చిత్రం ‘ప్రాజెక్ట్ కే‘. ఈ చిత్రాన్ని సుప్రసిద్ధ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్ లో అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. దీపికా పడుకునే నటిస్తుంటే.. కీలక పాత్రలో అమితాబ్ నటిస్తున్నారు. ఈ మూవీకి క్రియేటీవ్ హెడ్ గా సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు వర్క్ చేస్తుండడం విశేషం. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ చిత్రం పై అటు అభిమానుల్లోనూ ఇటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమా గురించి డైరెక్టర్ నాగ్ అశ్విన్ పలు ఆసక్తికర విషయాలను తెలియచేశారు. ఇంతకీ ఏం చెప్పారంటే.. ప్రాజెక్ట్ కే అనేది చాలా కొత్త సినిమా. స్క్రిప్ట్ కూడా కొత్తదని నాగ్ అశ్విన్ అన్నారు. క్రియేట్ చేసే వరల్డ్ – టెక్నికల్ గా అన్నీ కొత్తవే అని అన్నారు. ఇంకా చెప్పాలంటే..  సినిమా ఎలా చెయ్యాలి అన్నదానికే చాలా టైం పడుతుందని అన్నారు. సినిమా కోసం అన్నీ కొత్తగా తయారు చేస్తున్నామని వెల్లడించారు. మహానటికి కార్లు కావాలంటే రెంటుకు తీసుకురావచ్చని.. కానీ ఈ సినిమాకు వెహికల్స్ కావాలంటే ఎక్కడా దొరకవని.. కార్లు తయారు చేసుకోవాలని నాగి చెప్పుకొచ్చారు.

సైన్స్-ఫిక్షన్ చిత్రానికి ఫ్యూచర్  ఆటోమొబైల్స్ ను అభివృద్ధి చేయడంలో మహీంద్రా గ్రూప్ సహాయం అవసరమని నాగ్ అశ్విన్ కోరడంతో దీనికి ఆనంద్ మహీంద్రా అంగీకరించాడు. అలానే ఇటీవల ఈ సినిమా కోసం కెమికల్ ఇంజనీర్లు – స్పెషల్ ఎఫెక్ట్స్ లేదా ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ క్రియేట్ చేయడానికి సాంకేతిక బృందం కావాలని మేకర్స్ ప్రకటన ఇచ్చారు. ఇదంతా చూస్తుంటే.. ప్రభాస్ తో కలిసి నాగ్ అశ్విన్ ఏదో సరికొత్త ప్రపంచాన్ని తెర మీద ఆవిష్కరించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాడని అర్థమవుతోంది. మరి.. పాన్ వరల్డ్ మూవీగా రూపొందుతోన్న ప్రాజెక్ట్ కే చరిత్ర సృష్టిస్తుందేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్