Sunday, September 22, 2024
HomeTrending Newsనేటి నుంచి వరంగల్ మార్కెట్ ప్రారంభం

నేటి నుంచి వరంగల్ మార్కెట్ ప్రారంభం

వరంగల్ మార్కెట్ ఈ రోజు నుంచి ప్రారంభం అవుతుందని, అధ్వాన్న గోనె సంచులు, యూరియా బస్తాలు తప్ప అన్ని సంచుల కోసం రైతులకు 30 రూపాయలు చెల్లించేందుకు వ్యాపారస్తులు అంగీకరించారని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు  తెలిపారు. గన్నీ బ్యాగుల అంశంపై హనుమకొండలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌజ్ లో మంత్రి – రైతు సంఘాల నాయకులు, వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, మార్కెటింగ్ శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ అధికారులతో సంయుక్త సమావేశం నిర్వహించి, చర్చించారు.

ఈ సమావేశంలో మార్కెట్ ప్రారంభించేందుకు వ్యాపారస్తులు అంగీకరించారని వెల్లడించారు. రైతులు కూడా వీలైనంత వరకు మంచి బ్యాగులు వినియోగించాలని కోరారు. మిగతా మార్కెట్ లలో గన్నీ బ్యాగుల నాణ్యత, ధరపై అధ్యయనం చేసేందుకు ఇద్దరు రైతులు, ఇద్దరు చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, ఇద్దరు అధికారులతో కమిటీ వేసి అధ్యయనం చేయిస్తామని, 26వ తేదీలోపు నివేదిక ఇస్తారని, నివేదిక ఇవ్వగానే మరోసారి సమావేశం పెట్టి దీనికి శాశ్వత పరిష్కారం చేస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హామీ ఇచ్చారు.

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు  మాటలు…..

• రైతుకు నష్టం రాకుండా చూడాలి

• వ్యాపారస్తులు రైతులకు సహకరించాలి

• రైతుకు సమస్య రాకుండా మనందరం పాటుపడాలి

• నాణ్యతలో రాజీ వద్దు

• రైతులు వ్యాపారస్తులకే బాగా తెలుసు.

• రైతులు నాణ్యమైన గన్ని బ్యాగ్ లు తీసుకురావాలి

• రైతాంగం విషయంలో మన ప్రభుత్వం చేసినన్ని సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా చేయడం లేదు.

• అతుకుల గోనె సంచులకు 30 రూపాయలు ఇవ్వాలి. మరీ చినిగిన బస్తాలు వస్తే రిజెక్ట్ చేద్దాం.

• పూర్తిగా చెడిపోయిన గోనె సంచులు, యూరియా బస్తాలను రిజెక్ట్ చేస్తే అధికారులు పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు.

• రైతులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ , అధికారులతో కలిసి కమిటీ వేసి అధ్యయనం చేస్తాం. ఒక్కో వర్గం నుంచి ఇద్దరు చొప్పున కమిటీలో ఉంటారు.

• సౌండ్ గన్నీ విషయంలో కొంత మార్పులు చేస్తూ రేపే కొత్తగా తాత్కాలిక ఆర్డరు కలెక్టర్ గారు ఇస్తారు.

వరంగల్ కలెక్టర్ గోపి గారి మాటలు….

• వ్యాపారస్తుల సమస్య ధాన్యం, పత్తి చెడిపోవడం

• సౌండ్ గన్ని బ్యాగ్ కు 30 రూపాయలు ఇవ్వాలనేది 2017 నుంచి అమలులో ఉంది. కొత్తగా వచ్చింది కాదు.

• గన్ని బ్యాగ్ డబ్బు కట్ చేసే విధానం ఇప్పుడున్నది కాదు. వేరే చాలా విధానాలు ఉన్నాయి. దానిపై అవగాహన కల్పిస్తాం.

• మీకు రెండోసారి ఉపయోగించే గన్ని బ్యాగ్ కి మాత్రమే డబ్బులు ఇవ్వమని చెప్తాం

• మండల అధికారులతో కౌంటర్స్ ఏర్పాటు చేయిస్తాం. గన్ని బ్యాగ్ లపై వారికి అవగాహన కల్పిస్తాం

• వ్యాపారస్తులు రైతుల విషయంలో సానుకూలంగా ఉండాలి.

• సౌండ్ గన్ని కి ధర పెంచడం కోసం కమిటీ వేసి ముఖ్య మార్కెట్ లలో అధ్యయనం చేసి నిర్ణయం చేద్దాం.

• రైతులకు కూడా గన్ని బ్యాగ్ లాపై అవగాహన కల్పిస్తాం

• త్వరలో మరో సమావేశం పెడుదాం.

సమావేశంలో మార్కెగింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీభాయి, మార్కెటింగ్ శాఖ ఇతర అధికారులు, సిసిఐ అధికారులు, వ్యాపారస్తులు, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్