Saturday, September 21, 2024
HomeTrending Newsమంత్రి కేటిఆర్ కు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం

మంత్రి కేటిఆర్ కు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం

మంత్రి కే తారక రామారావుకి మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఆహ్వానం లభించింది. దుబాయ్ లో జరిగే ప్రపంచ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ షో కి ముఖ్యఅతిథిగా హాజరుకావాలని నిర్వాహకులు ఆహ్వానం పంపించారు. జూన్ 7, 8 వ తేదీల్లో ఈ ప్రదర్శన జుమేరా ఎమిరేట్స్ టవర్, దుబాయ్ లో జరుగుతుంది. మంత్రి కే తారకరామారావు సారధ్యంలో తెలంగాణ అద్భుతమైన పురోగతిని, ఐటీ మరియు ఐటీ అనుబంధ రంగాల్లో సాధించిందని, ఇలాంటి నాయకులు తమ సమావేశంలో పాల్గొనడం వలన సమావేశానికి ఎంతో విలువ చేకూరుతుందని నిర్వాహకులు మంత్రి కే తారక రామారావుకి పంపిన ఆహ్వానంలో పేర్కొన్నారు.

దుబాయిలో జరిగే ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రతినిధులతో పాటు ఆరోగ్యరంగం, రిటైల్ రంగం, మ్యానుఫ్యాక్చరింగ్, బ్యాంకింగ్ ఫైనాన్స్, రియల్ ఎస్టేట్, రవాణా వంటి అనేక రంగాలకు చెందిన కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఇప్పటికే విజయవంతమైన అనుభవాలను, వాటి ఫలితాలను ఈ సమావేశంలో ప్రదర్శిస్తారు.

దుబాయ్ కి అత్యంత కీలకమైన ఈ రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కలిగే ప్రయోజనాలను ప్రాథమికంగా చర్చించడంతోపాటు, వివిధ దేశాల నుంచి పాల్గొంటున్న ప్రతినిధులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో తమ అనుభవాలను వివరిస్తారని నిర్వాహకులు తెలిపారు. మంత్రి కే తారకరామారావు హాజరు కావడం ద్వారా దుబాయ్ లో ఉన్న భారతదేశ, ముఖ్యంగా తెలుగు ప్రవాస భారతీయ టెక్నాలజీ రంగ నిపుణులకు ఎంతో స్ఫూర్తిని ఇస్తుందని తెలిపారు. తెలంగాణ అనుభవాల నుంచి విదేశాలతో పాటు ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ మరియు ఆఫ్రికన్ రీజియన్ వంటి ప్రాంతాల నుంచి వస్తున్న ప్రతినిధులు స్ఫూర్తి పొందేందుకు అవకాశం ఉంటుందన్నారు. 41వ గ్లోబల్ ఎడిషన్ ఆఫ్ వరల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ షో కార్యక్రమంలో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో అద్భుతమైన ఫలితాలు సాధించిన సంస్థలకు, వ్యక్తులకు అవార్డులు ప్రధానం చేయనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్