Wednesday, September 25, 2024
Homeసినిమాబిజినెస్ లో రికార్డ్ క్రియేట్ చేసిన ఆదిపురుష్.

బిజినెస్ లో రికార్డ్ క్రియేట్ చేసిన ఆదిపురుష్.

ప్రభాస్, ఓంరౌత్ కాంబినేషన్లో రూపొందిన భారీ చిత్రం ‘ఆదిపురుష్‌’. రామాయణం ఆధారంగా మూవీ అని ప్రకటించినప్పటి నుంచి మరింత ఆసక్తి ఏర్పడింది. రాముడుగా ప్రభాస్ ను తెర పై చూడడానికి అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. జూన్ 16న మూవీని వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్ లో స్పీడు పెంచారు. ట్రైలర్ అండ్ సాంగ్ రిలీజ్ చేసిన తర్వాత ఆదిపురుష్ విజయం ఖాయమనే ఫీలింగ్ కామన్ ఆడియన్స్ లో సైతం కలిగించింది.

ఆదిపురుష్‌ పై ఉన్న హైప్ కారణంగా నాన్ థియేట్రికల్ హక్కులకు ఓ రేంజ్ లో పోటీ ఏర్పడింది. అలాగే థియేట్రికల్ బిజినెస్ కూడా భారీగా పోటీ ఏర్పడడం.. భారీ రేటుకు అమ్ముడుపోవడం విశేషం. ఆదిపురుష్ మూవీకి సంబంధించిన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏరియాల హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సొంతం చేసుకుందని తెలిసింది. ఇందుకోసం ఈ సంస్థ ఏకంగా 170 కోట్లు మొత్తాన్ని నిర్మాతలకు ఇచ్చినట్లు సమాచారం. ఇది టాలీవుడ్లో రెండో అత్యధిక బిజినెస్ గా రికార్డు క్రియేట్ చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్న చిత్రాల్లో ఆర్ఆర్ఆర్ ఫస్ట్ ఫ్లేస్ లో నిలిచింది. ఈ సినిమా 191 కోట్లుతో మొదటి స్థానంలో ఉంది. ఇప్పుడు ఆదిపురుష్ దీని తర్వాతి స్థానానికి చేరుకుంది. ఇక ఈ మూవీకి బిజినెస్ తగ్గట్లుగానే ఆంధ్రా తెలంగాణలో అత్యధిక థియేటర్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తుంది. ఈ సినిమాకి ఉన్న క్రేజ్.. దీనికి చేస్తున్న ప్రమోషన్స్ తో మరింతగా అంచనాలు పెరిగాయి. అయితే.. ఈ సినిమాకు ఎలాంటి ఓపెనింగ్స్ వస్తాయి..? ఇంత పెద్ద మొత్తాన్ని వసూలు చేయడం సాధ్యమౌతుందా అనేది హాట్ టాపిక్ అయ్యింది. అయితే.. మంచి టాక్ వస్తే.. ఈ చిత్రం తక్కువ రోజుల్లోనే రికార్డ్ కలెక్షన్ సాధించడం ఖాయం అంటున్నారు. మరి.. ఆదిపురుష్ ఎంత వరకు మెప్పిస్తాడో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్