Sunday, September 22, 2024
HomeTrending Newsజైపూర్ లో ప్రారంభమైన శర్వానంద్ పెళ్లి వేడుక

జైపూర్ లో ప్రారంభమైన శర్వానంద్ పెళ్లి వేడుక

హీరో శర్వానంద్‌, రక్షితల వివాహం రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరగనుంది. ఈ  వేడుక రెండు రోజులు పాటు వైభవంగా జరగనుంది. జైపూర్ లోని లీలా ప్యాలెస్ లో వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా ప్రారంభమయింది. కాసేపట్లో మెహందీ ఫంక్షన్ ప్రారంభం కానుంది. వివాహ వేడుక రాత్రి 11 గంటలకు మొదలు కానుంది. అసలైన పెళ్లి వేడుక రేపు ఉంటుంది. వీరి వివాహానికి పలువురు సినీ స్టార్స్, రాజకీయ నేతలు హాజరుకానున్నారు.

శర్వానంద్, రక్షిత ఎంగేజ్ మెంట్ జనవరిలో జరిగింది. హైదరాబాద్ లో జరిగిన ఎంగేజ్ మెంట్ లో ఇద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు. ఇప్పుడు వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. రక్షిత తండ్రి ఏపీ హైకోర్టు న్యాయవాది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్