Friday, October 18, 2024
Homeసినిమాచిరంజీవికి జోడీగా త్రిష..?

చిరంజీవికి జోడీగా త్రిష..?

చిరంజీవి ‘భోళా శంకర్’ మూవీ తర్వాత ఎవరితో సినిమా చేయనున్నారు అనేది ప్రకటించలేదు కానీ.. మల్లిడి వశిష్ట్, కళ్యాణ్ కృష్ణ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరితో సినిమాలను సమాంతరంగా సెట్స్ పైకి తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు కళ్యాణ్ కృష్ణతో చేయనున్న సినిమాకి సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇంతకీ మేటర్ ఏంటంటే..  ఈ సినిమాలో చిరంజీవికి జంటగా త్రిషను ఫైనల్ చేశారట. గతంలో చిరంజీవి, త్రిష కలిసి ‘స్టాలిన్’ సినిమాలో నటించారు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోయినా ఫరవాలేదు అనిపించింది.

ఆచార్య సినిమాలో చిరంజీవికి జోడీగా త్రిషను అనుకున్నారు కానీ… లాస్ట్ మినిట్ లో ఈ సినిమా నుంచి త్రిష తప్పుకుంది. ఆతర్వాత త్రిష పాత్రలో కాజల్ అగర్వాల్ ని తీసుకున్నారు. ఆమె పై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు కానీ.. ఎందుకనో ఆమె పాత్రనే ఎడిటింగ్ లో తీసేశారు. ఇదిలా ఉంటే.. ఆచార్య సినిమాలో నటించాల్సిన త్రిష ఇప్పుడు మరో సినిమాలో చిరుతో కలిసి నటించేందుకు ఓకే చెప్పింది. ఈ చిత్రాన్ని చిరంజీవి కుమార్తె సుస్మిత నిర్మించనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే ఈ చిత్రాన్ని అఫిషియల్ గా అనౌన్స్ చేయనున్నారు.

సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ కూడా ఈ చిత్రంలో ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. చిరు, సిద్దూ తండ్రీ కొడుకులుగా న‌టిస్తున్నారని సమాచారం. సిద్దూకి జోడీగా క్రేజీ హీరోయిన్ శ్రీ‌లీల పేరు ప‌రిశీలిస్తున్నారు. త‌ను కూడా దాదాపుగా ఖాయ‌మే. చిరు, త్రిష, సిద్ధూ, శ్రీలీల ఇలా క్రేజీ కాంబినేషన్లో రూపొందే ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుందట. బంగార్రాజు తర్వాత కళ్యాణ్‌ కృష్ణ చేస్తున్న సినిమా ఇది.  వాల్తేరు వీరయ్య సినిమాతో చిరంజీవి బ్లాక్ బస్టర్ సాధించడంతో ఫుల్ జోష్ తో సినిమాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని చిరు పుట్టినరోజున ప్రకటిస్తారని సమాచారం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్