షో, మిస్సమ్మ, నందనవనం 120 కి.మీ, మాయ ఇలా.. వైవిధ్యమైన చిత్రాలను అందించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్న డైరెక్టర్ నీలకంఠ. కొంత విరామం తర్వాత రూపొందించిన సినిమా ‘సర్కిల్’. ఈ చిత్రంలో సాయి రోనక్, బాబా భాస్కర్, అర్షిణ్ మెహతా,రిచా పనై కీలక పాత్రల్లో నటించారు. ఆరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎమ్.వి శరత్ చంద్ర, టి సుమలత అన్నిత్ రెడ్డి, వేణుబాబు అడ్డగడ ఈ చిత్రాన్ని నిర్మించారు. సరికొత్త థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని జూలై 7న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించారు.
ఒక ఫొటోగ్రాఫర్ జీవితం చుట్టూ అల్లుకున్న కథతో సర్కిల్ సినిమా తెరకెక్కింది. తన జీవితంలో శత్రువులెవరో, మిత్రులెవరో తెలియని సందిగ్ధంలో కథానాయకుడు ఏం చేశాడనేది ఆసక్తికరంగా చూపించబోతున్నారు దర్శకుడు నీలకంఠ. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన పాటలు, టీజర్ కు మంచి స్పందన వస్తోంది. త్వరలో ట్రైలర్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.