Saturday, September 21, 2024
Homeసినిమానీలకంఠ 'సర్కిల్' సినిమా ట్రైలర్ విడుదల

నీలకంఠ ‘సర్కిల్’ సినిమా ట్రైలర్ విడుదల

డైరెక్టర్ నీలకంఠ రూపొందించిన కొత్త సినిమా ‘సర్కిల్’. సాయి రోనక్, బాబా భాస్కర్, అర్షిణ్‌ మెహతా,రిచా పనై , నైనా కీలక పాత్రల్లో నటించారు. ఆరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎమ్.వి శరత్ చంద్ర, టి సుమలత అన్నిత్ రెడ్డి, వేణుబాబు అడ్డగడ నిర్మించారు. సరికొత్త థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా జూలై 7న విడుదల కానుంది. తాజాగా హైదరాబాద్ లో చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు నీలకంఠ మాట్లాడుతూ … నా సినిమాల్లో నాయిక పాత్రలకు మంచి ప్రాధాన్యత ఇస్తాను. షో లో మంజుల, మిస్సమ్మలో లయ, భూమిక, సదా మీ సేవలో చిత్రంలో శ్రియా..ఇలా నా హీరోయిన్ల క్యారెక్టర్స్ బాగుంటాయని అంతా చెబుతారు. ఈ చిత్రంలోనూ  ఆ ప్రయత్నాన్ని కొనసాగించాను. ఈ సినిమాలో అరుంధతి పాత్రలో రిచా పనై కనిపిస్తుంది. తనకు నచ్చిన లైఫ్ స్టైల్ లో జీవించే అమ్మాయి తను. స్వతంత్ర భావాలు గల యువతి. ఇప్పటిదాకా రిచా సాఫ్ట్ గర్ల్ క్యారెక్టర్స్ చేసింది.

అయితే.. ఇందులో వైబ్రైంట్ క్యారెక్టర్ లో ఆమెను చూపిస్తే కొత్తగా ఉంటుందని అనిపించింది. అలాగే అశ్రిణ్ కూడా తొలిసారి తెలుగు సినిమా చేస్తున్నా, బాగా నటించింది. రాజసం మన పుట్టుకతో వస్తుందని చెప్పే పాత్ర తనది. రాజకీయ నేపథ్య కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిగా నైనా కనిపిస్తుంది. సాయి రోనక్ తన కెరీర్ లో బెస్ట్ పర్మార్మెన్స్ ఇచ్చాడు. బాబా భాస్కర్ ది కీలక పాత్ర. సర్కిల్ థ్రిల్లర్ జానర్ లో ఓ మంచి అనుభూతిని పంచే సినిమా అవుతుంది అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్