Monday, September 23, 2024
Homeసినిమారామ్, పూరి డబుల్ ఇస్మార్ట్ కి ముహూర్తం ఫిక్స్

రామ్, పూరి డబుల్ ఇస్మార్ట్ కి ముహూర్తం ఫిక్స్

పూరి జగన్నాథ్ లైగర్ డిజాష్టర్ తర్వాత చాలా కథలు చాలా మంది హీరోలకు చెప్పారు. అయితే.. ప్రొడక్షన్ విషయంలో తేడా రావడంతో అనుకున్న ప్రాజెక్టులు సెట్స్ పైకి రాలేదు. అందుకనే దాదాపు సంవత్సరం పాటు ఖాళాగా ఉండాల్సివచ్చింది. పూరికి ఇలాంటి కష్టకాలంలో ఉంటే.. నేనున్నాను అంటూ ఆదుకునేందుకు హీరో రామ్ మరోసారి ముందుకు వచ్చాడు. ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ డబుల్ ఇస్మార్ట్ చేయడానికి అంతా రెడీ అయ్యింది. ఈసారి ఎలాగైనా సరే.. సక్సెస్ సాధించాలనే పట్టుదలతో పూరి ఈ కథను కసితో రెడీ చేశారని సమాచారం.

ఇంతకీ ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుంది అంటే.. ఈ నెల 9న ముహూర్తం ఫిక్స్ చేశారని తెలిసింది. పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించి ఆతర్వాత ఈ నెల 12 నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. దాదాపు సంవత్సరం పాటు కథ పై కసరత్తు చేయడం వలన కథ బాగా వచ్చిందని ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. ప్రస్తుతం రామ్ ‘స్కంద’ సినిమా చేస్తున్నాడు. బోయపాటి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇటీవల టైటిల్ ప్రకటించారు. దీనికి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది.

దసరాకి స్కంద చిత్రాన్ని రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ చిత్రానికి పోటీగా రిలీజ్ చేయడం ఇష్టంలేక అనుకున్న డేట్ కంటే ముందుగా సెప్టెంబర్ 15న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. జులై 12 నుంచి ‘డబుల్ ఇస్మార్ట్’ వర్క్ లో బిజీ కానున్నాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో  రామ్ ను మాస్ లోకి బాగా తీసుకెళ్లడంతో పూరి పై నమ్మకంతో మరోసారి సినిమా చేయడానికి ఓకే చెప్పాడు. ఈ చిత్రాన్ని ఛార్మి నిర్మిస్తుంది. మార్చి 8న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. మరి.. డబుల్ ఇస్మార్ట్ తో పూరి మళ్లీ ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్