Saturday, September 21, 2024
HomeTrending NewsFlorida: తొమ్మిదేళ్లలో తెలంగాణ...ప్రగతికి చిరునామా - మంత్రి నిరంజన్ రెడ్డి

Florida: తొమ్మిదేళ్లలో తెలంగాణ…ప్రగతికి చిరునామా – మంత్రి నిరంజన్ రెడ్డి

తెలంగాణకు ప్రవాసులు చేయూతనివ్వాలని, తొమ్మిదేళ్లలో తెలంగాణ స్వరూపం మారిపోయిందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ పేరు అంతర్జాతీయంగా మరింత ఆదరణ చూరగొంటున్నదన్నారు. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం టంపాలో టీఆర్ఎస్ యూఎస్ఎ కన్వీనర్ చందు తాళ్ల అధ్యక్ష్యతన జరిగిన ప్రవాస తెలంగాణవాసుల ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచ ప్రసిద్ది చెందిన పారిశ్రామిక దిగ్గజాలు పెట్టుబడులతో తెలంగాణకు వరస కడుతున్నారని చెప్పారు.

24 గంటల కరంటు, సాగునీరు, తాగునీరుతో అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు మౌళిక సదుపాయాల కల్పనతో ముందడుగు వేస్తున్నదని మంత్రి వెల్లడించారు. రైతుబంధు, రైతుభీమా, వ్యవసాయానికి 24 గంటల కరంటు, అందుబాటులో విత్తనాలు, ఎరువులతో తెలంగాణ సాగు దశమారిందన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి కల్పన రంగాలలో తెలంగాణ వేగంగా విస్తరిస్తున్నదని, కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాలలో ఇస్తున్న అవార్డులే దీనికి నిదర్శనమన్నారు. ఎదుగుతున్న తెలంగాణకు మట్టిబిడ్డల సహకారం కావాలని మంత్రి పేర్కొన్నారు. హిందూ టెంపుల్ ఆఫ్ ఫ్లోరిడాలో  మంత్రి నిరంజన్ రెడ్డి వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి కానుగంటి, టోని జాను, మోహిత్ కర్పూరం, తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఫ్లోరిడా అధ్యక్షులు అనిల్ బందారం, ఉపాధ్యక్షులు వెంకట్ రెడ్డి కంచర్ల, తెలుగు అసోసియేషన్ ఆఫ్ ఫ్లోరిడా అధ్యక్షురాలు మహాతి రెడ్డి, నాట్స్ చైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ, భానుప్రసాద్ ధూళిపాల, శేఖరం కొత్త, హిందూ టెంపుల్ ఆఫ్ ఫ్లోరిడా అధ్యక్షులు సాయి వర్మ, సీతారాం రెడ్డి భవనం, శ్రీకాంత్ జలగం, అశోక్ వర్దనం, నరేందర్ మెతుకు, సుధాకర్, సత్య, ఉదయ్, వెంకట్ ఎంకా, నాగరాజు రెడ్డి నల్లా, అరవింద్ తక్కళ్లపల్లి, రజనీకాంత్ కొసనం తదితరులు కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

న్యూస్