Monday, September 23, 2024
Homeసినిమాచిరు, పూరి సినిమా వెనుక ఏం జరిగింది..?

చిరు, పూరి సినిమా వెనుక ఏం జరిగింది..?

చిరంజీవి, పూరి జగన్నాథ్  కాంబినేషన్లో మూవీ అంటూ  చాలాకాలంగా వార్తలు వస్తున్నా సెట్స్ పైకి మాత్రం రావడం లేదు. అసలు చిరు రీ ఎంట్రీ మూవీ పూరి డైరెక్షన్ లో చేయాల్సి ఉన్నా అనుకోని కారణాల వలన ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఈమధ్య ‘గాడ్ ఫాదర్’లో చిరుతో కలిసి పూరి నటించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిరును పూరి ఇంటర్ వ్యూ  చేసినప్పుడు మంచి కథ ఉంటే సినిమా చేద్దామని చిరు ఆఫర్ ఇచ్చారు.

దాంతో ఈసారి చిరు, పూరి కాంబో ఫిక్స్ అనుకున్నారు కానీ.. ఈసారి కూడా ఈ క్రేజీ కాంబో మిస్ అయ్యింది. చిరు ప్రస్తుతం భోళా శంకర్ మూవీ కంప్లీట్ చేశారు. నెక్ట్స్ కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో ఓ మూవీ, మల్లిడి వశిష్ట్ డైరెక్షన్ లో మరో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక పూరి జగన్నాథ్..  హీరో రామ్ తో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈసారి ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ అంటూ మరో మాస్ మూవీ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వచ్చేందుకు రెడీ అవుతుంది.

చిరుకు పూరి ఆమధ్య ఓ కథ చెప్పారట. ఇది చిరుకు నచ్చిందట. అయితే.. తాను బిజీగా ఉండడంతో ఈ గ్యాప్ లో ఓ సినిమా చేసి రావాలని ఆ తర్వాత సినిమా మొదలు పెడదామని చెప్పారట. అందుకనే పూరి రామ్ తో డబుల్ ఇస్మార్ట్ మూవీ చేస్తున్నారని.. ఈ సినిమా పూర్తైన తర్వాత చిరుతో సినిమా ఖచ్చితంగా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. చిరుతో మూవీ చేయాలి అనేది పూరి డ్రీమ్. మరి.. పూరి డ్రీమ్ ఎప్పటికీ నెరవేరుతుందో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్