Thursday, September 19, 2024
Homeసినిమా'డబుల్ ఇస్మార్ట్' రెగ్యులర్ షూట్..?

‘డబుల్ ఇస్మార్ట్’ రెగ్యులర్ షూట్..?

రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ మరోసారి ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ ‘డబుల్ ఇస్మార్ట్’ కోసం జతకడుతున్న సంగతి తెలిసిందే. ఈరోజు ఈ సినిమా అధికారికంగా లాంచ్ అయింది. ఛార్మి క్లాప్‌ బోర్డ్‌ కొట్టగా.. రామ్ పై పూరి జగన్నాధ్ స్వయంగా యాక్షన్ చెప్పారు. “ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ ఇస్మార్ట్” అంటూ స్టైల్‌ గా మొదలైన ఈ సినిమా రెగ్యులర్ షూట్ జూలై 12 నుంచి స్టార్ట్ కానుంది.ఈ సినిమా మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8, 2024న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో విడుదల కానుంది. పూరి జగన్నాధ్ మరియు ఛార్మి కౌర్ కలిసి పూరీ కనెక్ట్స్‌పై, విషు రెడ్డి సీఈవోగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్