మహంకాళీ మూవీస్ బ్యానర్ పై మహంకాళీ దివాకర్ నిర్మాతగా హీరో ఆది సాయికుమార్, ‘ఆటగాళ్లు’ ఫేమ్ దర్షణ బానీక్ జంటగా జీబి కృష్ణ డైరెక్ట్ చేస్తున్న మూవీ ‘బ్లాక్’. వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ విజయవంతంగా ముందుకు సాగుతున్న ఆది సాయికుమార్ ఇప్పుడు ఈ మూవీతో మరోసారి తెలుగు ప్రేక్షకుల్ని అలరించబోతున్నారు. బ్లాక్ అనే క్యాచీ టైటిల్ ఈ సినిమాను ఖరారు చేస్తున్నట్లుగా ప్రకటించినప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్ పై అటు సాధారణ ప్రేక్షకుల్లో ఇటు ట్రెండ్ ఇండస్ట్రీ ట్రేడ్ వర్గాలో ఓ అసక్తి క్రియేట్ అయింది. దాంతో పాటే ఆది సాయికుమార్ ఇంటెన్స్ లుక్స్ తో విడుదలైన బ్లాక్ ఫస్ట్ లుక్ పోస్టర్ కి హ్యూజ్ రెస్పాన్ లభించింది.ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ కట్స్ తో రిలీజైన ఈ మూవీ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో
ట్రెండ్ అవుతుంది. ఈ సినిమాలో ఆమని, బిగ్ బాస్ ఫేమ్ కౌశల్ మందా, పృధ్వి రాజ్, సత్యం రాజేశ్, తాగుబోతు రమేశ్ తదితరులు నటిస్తున్నారు. అతి త్వరలోనే భారీ రేంజ్ లో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా దర్శక నిర్మాతలు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియనున్నాయి, ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ సినిమా ఆడియో విడుదలవుతుంది.