Thursday, March 12, 2026
HomeTrending Newsజగన్ పై రాయి విసిరిన దుండగుడు - ఎడమ కంటిపై గాయం

జగన్ పై రాయి విసిరిన దుండగుడు – ఎడమ కంటిపై గాయం

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మేమంతా సిద్ధం యాత్రపై ఓ  దుండగుడు రాయి విసిరాడు. ఆ రాయి నేరుగా జగన్ ఎడమ కంటిపై తాకడంతో గాయమైంది.   నగరంలోని సింగ్ నగర్ గంగానమ్మ గుడి వద్ద  బస్సుపై నుంచి జగన్ అభివాదం చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. జగన్ తో పాటు ఆయన పక్కనే ఉన్న మాజీ మంత్రి, సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్ధి వెల్లంపల్లి శ్రీనివాస్  కంటికి కూడా గాయమైంది.

ఈ హఠాత్ పరిణామంతో భద్రతా సిబ్బంది అవ్వక్కయ్యారు. వెంటనే తేరుకొని సిఎం ను బస్సులోకి తీసుకు వెళ్ళారు. ముఖ్యమంత్రి సహాయ నిధి వ్యవహారాలు పర్యవేక్షించే డా. హరికృష్ణ ప్రాథమిక చికిత్స చేశారు. కొద్దిసేపు విరామం అనంతరం జగన్ తన యాత్రను కొనసాగిస్తున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular