Monday, February 24, 2025
HomeTrending Newsకేసిఆర్ కు జగన్ పరామర్శ

కేసిఆర్ కు జగన్ పరామర్శ

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ ను ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు పరామర్శించారు. తుంటి సర్జరీ చేయించుకొని బంజారాహిల్స్ లోని నందినగర్ నివాసంలో కేసిఆర్ విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట్ చేరుకున్న వైఎస్ జగన్ కు టిఆర్ఎస్ నేతలు ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి స్వాగతం పలికారు. నందినగర్ నివాసం వద్ద కేటిఆర్, తలసాని శ్రీనివాస యాదవ్, పాడి కౌశిక్ రెడ్డి తదితరులు సాదరంగా జగన్ ను ఆహ్వానించారు.

కేసిఆర్ ను కలుసుకుని ఆయన యోగాక్షేమాలు జగన్ విచారించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్