Sunday, September 22, 2024
HomeTrending Newsకొలువు తీరిన కొత్త మంత్రివర్గం

కొలువు తీరిన కొత్త మంత్రివర్గం

Cabinet took oath: రాష్ట్ర  నూతన మంత్రివర్గం పదవీ ప్రమాణ స్వీకారం చేసింది.   అమరావతి వెలగపూడి సచివాలయ ప్రాంగణంలో జరిగిన  ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కొత్త మంత్రులతో ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రులకు అభినందనలు తెలిపారు.

వరుస క్రమంలో అంబటి రాంబాబు తొలుత ప్రమాణం స్వీకరించగా ఆ తరువాత వరుస క్రమంలో అంజాద్ భాషా, బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాలనాయుడు, బుగ్గన రాజేంద్రనాథ్, చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ, దాడిశెట్టి రాజా, ధర్మాన ప్రసాద రావు, గుడివాడ అమరనాథ్, గుమ్మనూరు జయరాం, జోగి రమేష్, కాకాణి గోవర్ధన్ రెడ్డి, కారుమూరి నాగేశ్వర రావు, కొట్టు సత్యనారాయణ, కె. నారాయణ  స్వామి, కేవీ ఉషశ్రీ చరణ్, మేరుగ నాగార్జున, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పినిపె విశ్వరూపు, పీడిక రాజన్న దొర, ఆర్కే రోజా, డా. సీదిరి అప్పల రాజు, తానేటి వనిత, విడదల రజని పదవీ స్వీకారం చేశారు.

అనంతరం గవర్నర్, సిఎం జగన్ తో పాటు మంత్రివర్గంతో గ్రూప్ ఫోటో దిగారు.

Also Read : జ్యోతిరావు పూలేకు సిఎం నివాళులు

RELATED ARTICLES

Most Popular

న్యూస్