Sunday, September 8, 2024
Homeసినిమాతెరపైకి 'ఆదిత్య 999' .. బాలయ్య దృష్టిలో ఆ డైరెక్టర్!

తెరపైకి ‘ఆదిత్య 999’ .. బాలయ్య దృష్టిలో ఆ డైరెక్టర్!

బాలకృష్ణ కెరియర్లో చెప్పుకోదగిన సినిమాలలో ‘ఆదిత్య 369’ ఒకటి. ‘టైమ్ మెషిన్’ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమా, 1991లో విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. సాంకేతిక పరిజ్ఞానం పెద్దగా అందుబాటులో లేని ఆ రోజులలోనే ఈ సినిమాను సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ఆసక్తికరంగా ఆవిష్కరించారు. ఆ సినిమాకి సీక్వెల్ చేయాలనే ఉద్దేశం బాలయ్యకి చాలా కాలంగా ఉంది. అందుకు తగిన యంగ్ డైరెక్టర్ కోసం ఆయన వెయిట్ చేస్తున్నారు.

అయితే ఈ రోజులలో  గ్రాఫిక్స్ తో కూడిన సినిమా అంటే అందుకు చాలా సమయం పడుతుంది .. చాలా ఖర్చు అవుతుంది. ముఖ్యంగా కథకు ఏ స్థాయిలో ఎంతవరకూ గ్రాఫిక్స్ అవసరమనేది దర్శకుడికి తెలిసి ఉండాలి. అలాంటి దర్శకుడి కోసమే బాలయ్య వెయిట్ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆయన దృష్టి ప్రశాంత్ వర్మపై పడిందని అంటున్నారు. అతని సమర్ధతపై బాలయ్యకి నమ్మకం ఏర్పడిందని చెబుతున్నారు.

ప్రశాంత్ వర్మ నుంచి ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘హను మాన్’ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ కథ ఆడియన్స్ కి కనెక్ట్ కావడంలో ‘వీఎఫ్ ఎక్స్’ వర్క్ ప్రధానమైన పాత్రను పోషించింది. ప్రశాంత్ వర్మ టేకింగ్ తో పాటు గ్రాఫిక్స్ పరంగా వచ్చిన అవుట్ పుట్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఓ మాదిరి బడ్జెట్ లోనే ఆయన ఈ రేంజ్ అవుట్ పుట్ ను రాబట్టుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. అందువల్లనే బాలయ్య ‘ఆదిత్య 999’ ప్రాజెక్టును ఆయనకి అప్పగించే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్