Friday, March 20, 2026
HomeTrending Newsసిఎం జగన్ తో బీసీ నేతల భేటి

సిఎం జగన్ తో బీసీ నేతల భేటి

BC MLAs, MLCs with CM
డిప్యూటీ ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, మంత్రులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, సీదిరి అప్పలరాజుల నేతృత్వంలో బీసీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అసెంబ్లీ లోని అయన ఛాంబర్ లో కలుసుకున్నారు. బీసీ జనగణన చేయాలని కేంద్రాన్ని కోరుతూ శాసనసభలో తీర్మానం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సిఎం జగన్ ను సన్మానించి, కృతజ్ఞతలు తెలిపారు.

బీసీల అభివృద్ది, సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మక చర్యలు, వెనకబడిన తరగతులను వెన్నెముక వర్గాలుగా తీర్చిదిద్దుతున్న వైనాన్ని ఆయా వర్గాలకు మరింతగా తెలియజెప్పేలా నాయకులు పనిచేయాలని సిఎం జగన్ ఈ సందర్భంగా నాయకులకు సూచించారు.

Also Read : బీసీల సంఖ్య తెలియాలి : సిఎం జగన్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular