Thursday, March 19, 2026
HomeTrending NewsBotsa Satyanarayana: ఎవరి గురించి వారు చూసుకుంటే మంచిది: బొత్స

Botsa Satyanarayana: ఎవరి గురించి వారు చూసుకుంటే మంచిది: బొత్స

ఆంధ్ర ప్రదేశ్ గురించి మాట్లాడే హక్కు హరీష్ రావుకు ఎక్కడిదని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఇక్కడి విషయాలు గురించి వ్యాఖ్యానించేందుకు అయన ఎవరు, ఆయనకు ఏం సంబంధం అంటూ అసహనం వ్యక్తం చేశారు. రాజకీయాల కోసం ఏదో మాట్లాడడం సరికాదని, బాధ్యత గల వ్యక్తులు తమ స్థాయి గుర్తెరిగి మాట్లాడాలని, చరిత్రలు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదని, ఎవరి రాష్ట్రం గురించి వారు మాట్లాడుకుంటే బాగుంటుందని సలహా ఇచ్చారు. ఏపీ వాళ్ళు తెలంగాణలో ఉండాలనుకుంటున్నారో, తెలంగాణ వాళ్ళు అమెరికాలో ఉండాలనుకుంటున్నారో అందరికీ తెలుసంటూ బొత్స ఎద్దేవా చేశారు. ఎవరో ఏదో మాట్లాడితే తాను సమాధానం చెప్పాలా అని ఎదురు ప్రశ్నించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular