Sunday, September 8, 2024
HomeTrending NewsBRS : కేంద్ర పాలకుల మూస ధోరణి - కెసిఆర్

BRS : కేంద్ర పాలకుల మూస ధోరణి – కెసిఆర్

సంపద సృష్టించి ప్రజలకు పంచుతూ దేశాన్ని గుణాత్మక అభివృద్ధి దిశగా నడిపించేందుకు వినూత్నరీతిలో విభిన్నమైన ఆలోచనలతో పాలన కొనసాగించాల్సిన అవసరమున్నదని బిఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పునరుద్ఘాటించారు.
దశాబ్ధాల స్వాతంత్ర్యానంతరం కూడా, అవే మూస ధోరణులను కేంద్ర పాలకులు అవలంబిస్తున్నారని తెలిపారు. అపారమైన సహజ వనరులను వినియోగించుకోవడం ఎటూ చేతగాని దేశ పాలకులకు, మహిళలు, రైతులు, యువత, వృత్తి కులాలు వంటి సంపద సృష్టించే అపూర్వమైన మానవ వనరులను కూడా సరైన పంథాలో వినియోగించుకోలేక పోతున్నారని స్పష్టం చేశారు. ఈ దిశగా దార్శనికత లేకపోవడం కారణంగా దేశంలో జరగాల్సినంత అభివృద్ధి జరగడం లేదని అధినేత సిఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
బిఆర్ఎస్ పార్టీ కేవలం వొక రాజకీయ పార్టీ మాత్రమే కాదని, అన్ని రంగాల్లో పూర్తిస్థాయిలో పరివర్తన చెందిన భారత దేశాన్ని తీర్చిదిద్దే మహోన్నత లక్ష్యంతో ఏర్పాటయిన ‘ భారత్ పరివర్తన్ మిషన్ ’ అని సిఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు.
మహారాష్ట్ర నుంచి పలు రంగాలకు చెందిన ప్రముఖుల చేరికలు గురువారం బిఆర్ఎస్ పార్టీలోకి కొనసాగాయి. ముంబయి సహా పలు ప్రాంతాలనుంచి వచ్చిన వారిని అధినేత సిఎం కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.


ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ….దేశ పాలకుల ఆలోచనల్లో మార్పు రావాలన్నారు. నల్లజాతీయుల పట్ల తర తరాలుగా వివక్ష చూపిన అమెరికా దేశం, బరాక్ ఓబామా వంటి నల్లజాతీయున్ని దేశాధ్యక్షున్ని చేసి తన పాపాన్ని ప్రక్షాళన చేసుకున్నదని వివరించారు. అభ్యుదయభావాలతో భిన్నమైన ఆలోచనా ధోరణులున్నప్పుడే దేశంలో సామాజిక సమానత్వం సాధ్యమౌతుందని సిఎం స్పష్టం చేశారు.
పురుషునికి సమాన సంఖ్యలో వున్న మహిళా శక్తిని కేవలం వంటింటికి పరిమితం చేస్తూ, ఉత్పాదక రంగంలో, సంపద సృష్టిలో వారిని భాగస్వాములను చేయక పోవడం వలన దేశం నష్టపోతున్నదని సిఎం పునరుద్ఘాటించారు. మహిళలు యువత సహా పలు రకాల మానవ వనరులను సక్రమంగా వినియోగించుకోవాలన్నారు. వారి వారి సామర్థ్యాలను గుర్తించి ఉత్పాదక, అనుత్పాదక రంగాల్లో వారికి అవకాశాలు కల్పించాలే తప్ప.. కేవలం వారి కులాన్ని బట్టో వర్గాన్ని బట్టో కాదని స్పష్టం చేశారు. ఇటువంటి వివక్షకు స్వస్తి పలకాలని, ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ దేశం అభివృద్ధి పథంలో పయనించాలంటే ఈ దిశగా సమూల మార్పు జరగాల్సిందేనని అన్నారు. బిఆర్ఎస్ పార్టీతోనే అన్ని రంగాల్లో గుణాత్మకంగా దేశాభివృద్ధి సాధ్యమౌతుందని సిఎం స్పష్టం చేశారు.

ఇటువంటి రాజకీయ సంక్షోభ సమయంలో, తెలంగాణ మోడల్ అభివృద్ధిని దేశ ప్రజలముందుంచిన బిఆర్ఎస్ పార్టీని మహారాష్ట్ర ప్రజలు బలంగా కోరుకుంటున్నారని వారు మరోసారి తెలిపారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ ’ అనే నినాదంతో ఏకోన్ముఖంగా ముందుకు పోతామని వారు ఉత్సాహంగా తెలిపారు. ఈ సందర్భంగా….బిఆర్ఎస్ నేతలు హోం మంత్రి మహమూద్ అలీ, ఎంపీ బిబి పాటిల్, శంకరన్న దోంగ్డే, మాణిక్ కదమ్, ఎస్ వేణుగోపాలచారి, ముంబై ధారవి దేవానంద్ నాగెల్ల, షివ్డీ నుంచి రమేశ్ బండారం తదితరులున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్