Friday, September 20, 2024
Homeసినిమాచిరు మరో డైరెక్టర్ కి ఓకే చెప్పారా.?

చిరు మరో డైరెక్టర్ కి ఓకే చెప్పారా.?

చిరంజీవి రీ ఎంట్రీలో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళుతున్నారు. సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఈ సినిమా దాదాపు 200 కోట్లకు పైగా కలెక్ట్ చేయడం విశేషం. ప్రస్తుతం ‘భోళా శంకర్’ మూవీ చేస్తున్నారు. మెహర్ రమేష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఇందులో చిరుకు జంటగా తమన్నా నటిస్తుంటే.. చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తుంది. సుశాంత్ గెస్ట్ రోల్ చేస్తుండడం విశేషం.

భోళా శంకర్ సినిమా తర్వాత చిరంజీవి నటించే చిత్రం అధికారికంగా ప్రకటించలేదు కానీ.. డైరెక్టర్స్ కళ్యాణ్ కృష్ణ, మల్లిడి వశిష్ట్ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరి దర్శకులతో సినిమాలను సమాంతరంగా సెట్స్ పైకి తీసుకురావాలి అనుకుంటున్నారని సమాచారం. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రకటించనున్నారు. ఆగష్టు నుంచి సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉంది. అయితే.. ఇప్పుడు మళయాళలో సంచనలన విజయం సాధించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన చిత్రం 2018 దర్శకుడు జూడే ఆంథోనీతో చిరంజీవి సినిమా చేయనున్నారని ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది.

2018 చిత్రాన్ని తెలుగులో గీతా డిస్ట్రిబ్యూషన్ ద్వారా అల్లు అరవింద్ రిలీజ్ చేశారు. ఈ సినిమా తెలుగులో కూడా బాగానే సక్సెస్ అయ్యింది. మంచి లాభాలను తీసుకువచ్చింది. దాంతో ఈ డైరెక్టర్ అల్లు అరవింద్ కి కథ చెప్పారని.. ఆ కథ చిరంజీవికి సెట్ అవుతుందని.. ఈ కాంబో మూవీ ప్లానింగ్ లో ఉందని టాక్ వినిపిస్తుంది. ఈ కథ వైజాగ్ నేపథ్యంలో ఉంటుందని ప్రచారం జరుగుతుంది. అయితే.. నిజంగానే 2018 డైరెక్టర్ చిరంజీవి కోసం కథ రెడీ చేశారా..? లేక ప్రచారంలో ఉన్నది గ్యాసిప్పా..? అనేది తెలియాల్సివుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్