Tuesday, September 17, 2024
HomeసినిమాChiranjeevi: చిరు, వశిష్ట్ ప్రాజెక్ట్ వెనుక ఏం జరిగింది..?

Chiranjeevi: చిరు, వశిష్ట్ ప్రాజెక్ట్ వెనుక ఏం జరిగింది..?

చిరంజీవి ప్రస్తుతం ‘భోళా శంకర్’ మూవీ చేస్తున్నారు. మెహర్ రమేష్ డైరెక్షన్ లో రూపొందుతోన్న మూవీ ఆగష్టు 11న విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత చిరు ఎవరితో సినిమా చేయనున్నారో అధికారికంగా ప్రకటించలేదు కానీ.. బింబిసార డైరెక్టర్ మల్లిడి వశిష్ట్ తో సినిమా చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇది నిజమేనా.? లేక గ్యాసిప్పా..? అంటే… నిజమే అని తెలిసింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. యువీ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ప్లాన్ చేస్తుంది. ఆగష్టు నుంచి ఈ సినిమా సెట్స్ పైకి రానుందని సమాచారం.

అయితే.. అస్సలు ఊహించని ఈ ప్రాజెక్ట్ ఎలా సెట్ అయ్యింది.? దీని వెనుక ఏం జరిగింది..? అనేది ఆసక్తిగా మారింది. ఇంతకీ విషయం ఏంటంటే… వశిష్ట్.. రామ్ చరణ్ తో సినిమా చేయాలి అనుకున్నారట. చ‌ర‌ణ్ క‌థ‌ల‌న్నీ చిరునే వింటారు. అలా చ‌ర‌ణ్ క‌థ చిరుకి వినిపించే స‌మ‌యంలో.. మ‌రో ఐడియాని చిరుతో పంచుకున్నారట. అది చిరుకి న‌చ్చ‌డంతో.. చ‌ర‌ణ్ క‌థ‌ని ప‌క్క‌న పెట్టి ఈ క‌థ‌ పై వ‌ర్క్ చేయ‌మ‌ని చిరు చెప్పడం జ‌రిగిందట. అలా.. చ‌ర‌ణ్ తో సినిమా చేద్దామ‌ని వెళ్లిన వ‌శిష్ట‌కు.. చిరు నుంచి ఆఫ‌ర్ అందిందని అసలు విషయం బయటకు వచ్చింది.

ఈ సినిమాలో గ్రాఫిక్స్‌కి అధిక ప్రాధాన్యం ఉంద‌ట‌. అందుకే.. ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌కు త‌గిన స‌మ‌యం తీసుకోవాల‌ని వ‌శిష్ట భావిస్తున్నాడు. యువీ క్రియేషన్స్ బ్యానర్ లో ఎప్పటి నుంచో చిరంజీవి సినిమా చేయాలి అనుకుంటున్నారు. ఈ బ్యానర్ లో మారుతితో చిరు సినిమా చేయాలి అనుకున్నారు. అయితే.. మారుతి ప్రభాస్ మూవీతో బిజీగా ఉండడంతో కుదరలేదు. ఇప్పుడు ఇలా వశిష్ట్ డైరెక్షన్ లో చిరు సినిమా కన్ ఫర్మ్ అయ్యింది. ఈ సినిమా భారీ విజువల్స్ తో వావ్ అనేలా ఉంటుందట. త్వరలో ఈ చిత్రాన్ని ప్రకటించనున్నారని సమాచారం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్