Monday, March 16, 2026
HomeTrending NewsYuva Galam: డ్రెయిన్లు కూడా వదలడం లేదు: లోకేష్ సెల్ఫీ

Yuva Galam: డ్రెయిన్లు కూడా వదలడం లేదు: లోకేష్ సెల్ఫీ

యువ గళం పాదయాత్రలో అధికార వైసీపీ ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు చేస్తోన్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్  నేడు కావలి ఎమ్మెల్యే  అనుచరులపై ఆరోపణ చేశారు. డ్రెయిన్ ఆక్రమించారంటూ సేల్ఫీ తీసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.

” రాష్ట్రంలో వైసిపి దొంగలు కబ్జాకు కాదేది అనర్హమంటూ యథేచ్చగా ఆక్రమణలకు పాల్పడుతున్నారు. కొండలు, గుట్టలు, శ్మశానాలు, డ్రెయిన్లను సైతం వదలకుండా మింగేస్తున్నారు. ఇది కావలి నియోజకవర్గం ఆములదిన్నె బిట్-2 పరిధిలో రోడ్డు వెంట ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి అనుచరుడు కాటా శ్రీనివాసరెడ్డి కొండపి డ్రెయిన్ ను పూడ్చేసి వేసిన లే అవుట్. రోడ్డును ఆనుకొని 15ఎకరాల డ్రెయిన్ ను ఆక్రమించడమేగాక 5 తూములను కూడా పూడ్చేశారు. ఫలితంగా రైతుల పొలాలు ముంపునకు గురవుతున్నాయి. ఎవరు ఏమైపోయినా ఫర్వాలేదు, తాడేపల్లి ప్యాలెస్ ఖజానా నిండాలన్న జగన్ రెడ్డి గారి సిద్ధాంతాన్నే ఆయన సామంతరాజులు ఫాలో అవుతున్నారు. తమకు లైవ్ లో నరకం చూపిస్తున్న జె-గ్యాంగ్ కు చుక్కలు చూపించేందుకు జనం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular