Wednesday, March 26, 2025
HomeTrending Newsకెమెరా పట్టి ఫొటోలు తీసిన చంద్రబాబు

కెమెరా పట్టి ఫొటోలు తీసిన చంద్రబాబు

వరల్డ్ ఫోటోగ్రఫీ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుభాకాంక్షలు తెలుయజేశారు.  వివిధ మీడియా సంస్థల్లో పనిచేస్తోన్న ఫోటో జర్నలిస్టులు సిఎంను తాడేపల్లిలోని ఆయన నివాసంలో కలుసుకున్నారు.

సిఎం వారిని ఆప్యాయంగా పలకరించి అనతరం ఓ ఫొటో జర్నలిస్ట్ చేతిలోని కెమెరాను తీసుకుని స్వయంగా సిఎం ఫోటోలు క్లిక్ మనిపించారు. మీడియాలో ఫోటోగ్రఫీ విభాగంలో విధులు చాలా కష్టతరమని వ్యాఖ్యానించిన బాబు మంచి ఫొటోలు తీస్తూ రాణిస్తున్నారంటూ వారిని అభినందించారు. నాణ్యమైన సేవలతో ఫోటోగ్రఫీ రంగం బాగుండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలుగు, ఇంగ్లీష్ పత్రికల్లో పనిచేస్తున్న సీనియర్ ఫోటో జర్నలిస్టులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్