Sunday, September 8, 2024
HomeTrending NewsCM Tour: కేంద్ర మంత్రులతో సిఎం జగన్ భేటీ

CM Tour: కేంద్ర మంత్రులతో సిఎం జగన్ భేటీ

ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమై రాష్ట్రానికి చెందిన అంశాలపై చర్చలు జరిపారు. తొలుత కేంద్ర ఆర్థికశాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ తో ముఖ్యమంత్రి సమావేశమై రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయమై వినతి పత్రం సమర్పించారు.

అనంతరం కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ ను కలుసుకొని తెలంగాణ నుంచి ఎపీకి రావాల్సిన విద్యుత్ బకాయిల విషయమై చర్చలు జరిపారు,. త్వరగా ఈ బకాయిలు వచ్చేలా చొరవ చూపాలని కోరారు. రాష్ట్రంలో విద్యుత్ రంగంలో ప్రభుత్వం  చేపడుతోన్న సంస్కరణలను కేంద్ర మంత్రి ప్రశంసించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్