Tuesday, September 24, 2024
HomeTrending Newsజి 20 సదస్సుకు సర్వం సిద్ధం: రేపు విశాఖకు సిఎం జగన్

జి 20 సదస్సుకు సర్వం సిద్ధం: రేపు విశాఖకు సిఎం జగన్

విశాఖపట్నంలో రేపు  మార్చి 28నుంచి మూడు రోజులపాటు నిర్వహించనున్న జీ 20 సదస్సు వర్కింగ్ గ్రూప్ సదస్సుకు నగరం ముస్తాబైంది. జి-20 దేశాలకు ఇండియా ప్రాతినిధ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మక జి 20 సదస్సు ఈ ఏడాది చివర్లో ఇండియాలో జరుగుతుంది. ఈలోగా వివిధ రంగాలకు సంబంధించిన వర్కింగ్ గ్రూప్ సమావేశాలు దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్నాయి.

జి20… మౌలిక సదుపాయాల వర్కింగ్ గ్రూప్ రెండవ భేటీకి విశాఖ నగరం ఆతిథ్యం ఇస్తోంది. వివిధ దేశాలకు చెందిన అతిథులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు సాయంత్రం విశాఖ చేరుకుంటారు. వివిధ దేశాల ప్రతినిధులతో ముఖాముఖి సమావేశంలో ఆయన పాల్గొంటారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్