Wednesday, March 11, 2026
HomeTrending NewsNethanna Nestham: 21న వెంకటగిరికి సిఎం

Nethanna Nestham: 21న వెంకటగిరికి సిఎం

రాష్ట్ర ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 21న  తిరుపతి జిల్లా  వెంకటగిరిలో పర్యటించనున్నారు. వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం ద్వారా వరుసగా ఐదో ఏడాది  80,686 మంది లబ్దిదారులకు మొత్తం రూ.300 కోట్ల మేర నిధులు జమ చేయనున్నారు.

వెంకటగిరిలో సీఎం పర్యటన ఏర్పాట్లను రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డిప్యూటీ సిఎం కే నారాయణ స్వామి, ముఖ్యమంత్రి టూర్ కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం
కార్యక్రమం లో పాల్గొన్న వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త  నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, ఎంపి ఎం గురు మూర్తి, సత్యవేడు ఎమ్మెల్యే  ఆదిమూలం, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, కలెక్టర్  వెంకటరమణా రెడ్డి, ఇతర అధికారులు పరిశీలించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular