Sunday, September 8, 2024
HomeTrending Newsపోలవరానికి సీఎం వైఎస్‌ జగన్‌

పోలవరానికి సీఎం వైఎస్‌ జగన్‌

పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించేందుకు బుధవారం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. ఈ పరిశీలనలో వెల్లడైన అంశాల ఆధారంగా జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. గడువులోగా ప్రాజెక్టును పూర్తిచేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేయనున్నారు.

ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూలు ఇదీ.

బుధవారం ఉ.10.00 : సీఎం నివాసం నుంచి రోడ్డు మార్గంలో హెలీప్యాడ్‌కు చేరుకుంటారు.

10.10: హెలీకాప్టర్‌లో పోలవరానికి ప్రయాణం

11.00: ప్రాజెక్టు హెలీప్యాడ్‌ వద్దకు చేరిక

11.10–12.00: క్షేత్రస్థాయిలో పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలన

మ.12.00–1.00: అధికారులతో సమీక్ష సమావేశం

1.20: హెలీకాప్టర్‌లో తిరుగుపయనం

2.00: తాడేపల్లిలోని హెలీప్యాడ్‌కు రాక

2.15: సీఎం నివాసానికి తిరిగి పయనం అవుతారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్