Friday, September 20, 2024
Homeసినిమా‘మంత్ ఆఫ్ మధు’ మనకు ధైర్యం ఇచ్చే సినిమా - కలర్స్ స్వాతి

‘మంత్ ఆఫ్ మధు’ మనకు ధైర్యం ఇచ్చే సినిమా – కలర్స్ స్వాతి

నవీన్ చంద్ర, స్వాతి రెడ్డి కలసి నటించిన చిత్రం ‘మంత్ ఆఫ్ మధు’. దర్శకుడు శ్రీకాంత్ నాగోతి ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహించారు. యశ్వంత్ ములుకుట్ల క్రిషివ్ ప్రొడక్షన్స్, హ్యాండ్‌పిక్డ్ స్టోరీస్ బ్యానర్‌ పై దీనిని నిర్మించారు. సుమంత్ దామ సహ నిర్మాతగా, రఘువర్మ పేరూరి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

‘మంత్ ఆఫ్ మధు’ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే ఒక యూనిక్ రిలేషన్ షిప్ డ్రామా. నవీన్ చంద్ర,  స్వాతిల ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ ప్రధాన హైలైట్‌లలో ఒకటిగా ఉంటుంది. ఈ సినిమా టీజర్‌, ఫస్ట్‌ సాంగ్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ రోజు, మేకర్స్ చిత్రం విడుదల తేదీని అనౌన్స్ చేశారు. మంత్ ఆఫ్ మధు అక్టోబర్ 6న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ పోస్టర్‌లో నవీన్ చంద్ర, స్వాతి అందంగా కనిపించారు. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రెస్ నిర్వహించింది.

ఈ సందర్భంగా స్వాతి రెడ్డి మాట్లాడుతూ… ‘మంత్ ఆఫ్ మధు’ లో మాకు తెలిసిన నిజాన్ని నిజాయితీగా చెప్పాం. మనకు చిన్నప్పుటి నుంచి ఏదో చెప్తారు, ఏదో నమ్ముతాము. కానీ రియల్ లైఫ్ డిఫరెంట్ గా వుంటుంది. ఈ సినిమాలో చూపించిన నిజం ధైర్యం ఇచ్చేలా వుంటుంది. ఈ మా సినిమాలో వున్నా నిజాయితీ ప్రేక్షకులకు నచ్చుతుందని నమ్ముతున్నాను. దర్శకుడే ఈ కథ రాశారు. ఇది ఫిమేల్ సెంట్రిక్ సినిమా కాదు. అలాగే బాధ పడే సినిమా కూడా కాదు. ధైర్యం ఇచ్చే సినిమా. అక్టోబర్ 6న మీ ముందుకు వస్తోంది. నవీన్ తో పాటు అందరికీ థాంక్స్. నన్ను గుర్తుపెట్టుకొని ఇంత ప్రేమ ఇస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు’’ తెలిపారు.

దర్శకుడు శ్రీకాంత్ నాగోతి మాట్లాడుతూ.. నవీన్ చంద్ర గారితో మళ్ళీ కలసి సినిమా చేయాలనుకున్నపుడు ఈ కథని అనుకున్నాం. స్వాతి గారు ఈ సినిమాలోకి వచ్చిన తర్వాత మరింత  ఆసక్తికరంగా మారింది.  ఈ సినిమా టీం వర్క్. నటీనటులు, టెక్నికల్ టీం గొప్పగా సహకరించారు. మేము ఎంత ప్యాషనేట్ గా తీశామో.. ప్రేక్షకులకు కూడా అంతే చక్కగా రీచ్ అవుతుందనే నమ్మకం వుంది. అక్టోబర్ 6న సినిమాని ప్రేపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం. మీ అందరికీ నచ్చుతుందనే నమ్మకం వుంది’ అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్