
8 ఏళ్లలో ఏం చేశారు అని కొంతమంది ప్రశ్నిస్తున్నారని, హైదరాబాద్ తో పాటు కొన్ని జిల్లాలకు రాబోయే శతాబ్దం వరకు మంచి నీటిని అందించే ప్రాజెక్ట్ కాళేశ్వరం అన్నారు. రాబోయే రోజుల్లో మీరే ఈ వార్తను అంగీకరిస్తారన్నారు. ఇంటింటికి నీళ్లు అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఈ విషయం చెప్పింది కేంద్ర జల శక్తి మిషన్…కానీ ఆ శాఖ మంత్రే ఇక్కడకు వచ్చి తిడుతారు అది వేరే విషయం అన్నారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణాలో కొందరు మతం పేరిట రాజకీయం చేయాలని చూస్తున్నారని మంత్రి కేటిఆర్ ధ్వజమెత్తారు. నా పేరు మీద కొట్టుకు చావండి అని ఏ దేవుడు చెప్పాడని, మతం పేరుతో… దేవుడి పేరుతో.. కొట్లాటలు చేయమని ఎవరు చెప్పారని ప్రశ్నించారు. నా దృష్టిలో మా అమ్మ నా దేవత అన్నారు. 12 లక్షల కోట్ల రూపాయల కార్పొరేట్ ట్యాక్స్ ని మాఫీ చేయొచ్చట కానీ… పేదలకు 2, 3 లక్షలు పెట్టి పెన్షన్లు ఇవ్వొద్దని కొందరు నీతులు చెపుతున్నారని విమర్శించారు. ఉచితాలు అని మాట్లాడుతున్నారు.. 400 ఉన్న సిలిండర్ 1000 రూపాయలు ఎందుకు అయ్యింది అంటే మాత్రం నోరు ఎత్తరని కేటిఆర్ మండిపడ్డారు.