Monday, September 23, 2024
HomeTrending Newsఎస్సీ విద్యార్థుల‌కు 33 జిల్లాల్లో ఫ్రీ కోచింగ్

ఎస్సీ విద్యార్థుల‌కు 33 జిల్లాల్లో ఫ్రీ కోచింగ్

టీఎస్‌పీఎస్సీ నిర్వ‌హించే గ్రూప్ 1, 2, 3, 4 ఉద్యోగాల‌కు ప్రిపేర్ అయ్యే ఎస్సీ విద్యార్థుల‌కు ఎస్సీ అభివృద్ధి శాఖ శుభ‌వార్త వినిపించింది. ఎస్సీ ఉద్యోగార్థుల కోసం 33 జిల్లాల్లో ఉచిత కోచింగ్ అందించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఒక్కో జిల్లా కేంద్రంలోని స్ట‌డీ సెంట‌ర్ల‌లో 75 నుంచి 150 మందికి ఉచితంగా కోచింగ్ ఇవ్వ‌నున్నారు. డిగ్రీ ఉత్తీర్ణులై ఉండి, కుటుంబ వార్షిక ఆదాయం రూ. 3 ల‌క్ష‌ల లోపు ఉన్న‌వారికి అవ‌కాశం క‌ల్పించ‌నున్నారు. డిగ్రీలో వ‌చ్చిన మార్కుల ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేయ‌నున్నారు.
9 నుంచి రిజిస్ట్రేష‌న్లు..
అర్హులైన అభ్య‌ర్థులు ఈ నెల 9వ తేదీ నుంచి 18వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో త‌మ వివ‌రాల‌ను న‌మోదు చేసుకోవ‌చ్చు. డిగ్రీ మార్కుల ఆధారంగా 19వ తేదీన మెరిట్ జాబితాను రూపొందించి, 20న విడుద‌ల చేయ‌నున్నారు. అర్హ‌త సాధించిన అభ్య‌ర్థుల మొబైల్ ఫోన్ల‌కు మేసేజ్‌లు పంప‌నున్నారు. 22న స‌ర్టిఫికెట్ల‌ను ప‌రిశీలించి, 25 నుంచి ఉచిత కోచింగ్‌ను ప్రారంభించ‌నున్నారు.
రోజుకు రూ. 75 చొప్పున చెల్లింపు
ఈ ఉచిత కోచింగ్ ఒక‌టిన్న‌ర నెల‌ల నుంచి రెండు నెల‌ల దాకా కొన‌సాగ‌నుంది. కోచింగ్‌కు ఎంపికైన అభ్య‌ర్థుల‌కు ప్ర‌తి రోజు రూ. 75 చొప్పున‌(లంచ్, టీ కోసం) చెల్లించ‌నున్నారు. దీంతో పాటు రూ. 1500 విలువ చేసే మెటిరీయ‌ల్‌ను కూడా అందించ‌నున్నారు. రిజిస్ట్రేష‌న్ కోసం http://tsstudycircle.co.in అనే వెబ్‌సైట్‌ను సంప్ర‌దించాలి.

Also Read : గ్రూప్-1 ఉద్యోగాల‌న్నీలోక‌ల్ రిజ‌ర్వేష‌న్ల ప‌రిధిలోకే

RELATED ARTICLES

Most Popular

న్యూస్