Sunday, September 8, 2024
Homeసినిమాఆ బాధను తెలియజేయాలనే బేబి తీశాను - సాయి రాజేష్

ఆ బాధను తెలియజేయాలనే బేబి తీశాను – సాయి రాజేష్

మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద ఎస్‌కేఎన్ నిర్మించిన చిత్రం బేబీ. ఈ చిత్రానికి సాయి రాజేష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించారు. ఈ మూవీ జూలై 14న రిలీజ్ అయింది. ప్రీమియర్ షోల నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. ఇక ఈ సినిమా మొదటి రోజు రికార్డ్ కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ అయింది. దీంతో సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ఆడియెన్స్‌కు థాంక్స్ చెప్పేందుకు చిత్రయూనిట్ థాంక్యూ మీట్‌ను నిర్వహించింది.

ఈ ఈవెంట్‌లో సాయి రాజేష్ మాట్లాడుతూ.. ‘నేను మామూలుగా చకచకా పరిగెత్తేలా స్క్రిప్ట్ రాస్తాను కానీ.. ఈ బేబీ కథ రాస్తున్నప్పుడు మాత్రం ఈ కథని, పాత్రలని మెల్లిగానే చూపించాలని అనుకున్నా. ఇలా స్లో నెరేషన్‌తో సినిమా తీస్తే ఆడుతుందో లేదో అని అనుకున్నాను. కానీ ప్రేక్షకులు మాత్రం ప్రతీ సీన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. తిట్టే వాళ్లు తిడుతున్నారు.. పొగిడే వాళ్లు పొగుడుతున్నారు. నేను అన్నింటినీ స్వీకరిస్తాను. ఇరవై ఏళ్ల క్రితం నేను ప్రేమించాను. ఓ ఎనిమిది నెలలు నేను నరకం అనుభవించాను. ఆ బాధను తెలియజేయాలని ఈ కథ రాసుకున్నాను.

నేను వైష్ణవి కోణంలో కథ రాయలేదు. ఆనంద్ కోణంలోంచి కథ రాసుకున్నాను. నా తొలిప్రేమ సక్సెస్ అయింది కానీ.. ఆ బాధ మాత్రం నాకు తెలుసు. ఆ బాధ ఎలా ఉంటుందో చూపించాలని అనుకున్నాను. మున్ముందు నేను సినిమాలు నిర్మిస్తాను. దర్శకత్వం వహిస్తాను. నెక్ట్స్ మళ్లీ మా ఎస్ కే ఎన్‌తోనే చేస్తున్నాను. ఈ మూడు పాత్రలు రాయడానికి నేను ఎంతో స్ట్రగుల్ అయ్యాను. ఎవరి కోణంలో ఆలోచించి రాయాలి.. ఎలా తీయాలని ఎంతో మథన పడ్డాను.

ఇక టైటిల్‌ విషయంలోనూ ఎంతో ఆలోచించాను. నా సినిమాలకు క్యాచీ టైటిల్ ఉండాలని భావిస్తాను. అలాంటి క్రమంలో బేబీ అని పెట్టాలని అనుకున్నాను. దానికి తగ్గట్టుగా స్క్రిప్ట్‌లో మార్పులు కూడా చేశాను. ప్రేమ వల్లే వచ్చే సంతోషం కన్నా బాధే చాలా ప్రభావం చూపిస్తుంది.. గట్టిగా ఉంటుంది. ప్రేమంటే నిర్వచించడం కష్టం. ప్రేమ వల్ల ఎందుకు బాధ వస్తుందంటే చెప్పలేం. బూతులు ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి. నేను ఇలా రా గా ఉండాలనే తీశాను. సెన్సార్ వల్ల ఇంకా చాలా కట్ అయ్యాయి కానీ.. నాకు ఇది తప్పలేదు. అలాంటి పదాలు పెట్టినందుకు ఓ పది టికెట్లు తెగుతాయని మాత్రం కాదు’ అని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్