Thursday, March 19, 2026
HomeTrending Newsఎమ్మెల్సీలుగా కవిత, దామోదర్ రెడ్డి ప్రమాణం

ఎమ్మెల్సీలుగా కవిత, దామోదర్ రెడ్డి ప్రమాణం

ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన కల్వకుంట్ల కవిత(నిజామాబాద్), కూచుకుళ్ల దామోదర్ రెడ్డి(మహబూబ్ నగర్)లు నేడు ప్రమాణస్వీకారం చేశారు. శాసనమండలి లోని  ప్రొటెం చైర్మన్ జాఫ్రీ ఛాంబర్ లో వారు పదవీ ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, మహమ్మద్ అలీ,  శ్రీమతి సత్యవతి రాథోడ్, ఎంపీలు బీబీ పాటిల్, కే ఆర్ సురేష్ రెడ్డి, రైతు బంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు గణేష్ గుప్తా, షకీల్ మహ్మద్, సంజయ్ కుమార్, ఎమ్మెల్సీలు గంగాధర్ గౌడ్,  ఫారూఖ్ హుస్సేన్,  భానుప్రసాదరావు, ఎమ్.ఎస్ ప్రభాకర్ రావు, ఎల్.రమణ, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular