Friday, September 20, 2024
Homeసినిమాఎన్టీఆర్, హృతిక్‌ల భారీ మల్టీస్టారర్‌లో హీరోయిన్‌గా కియరా అద్వానీ.. ?

ఎన్టీఆర్, హృతిక్‌ల భారీ మల్టీస్టారర్‌లో హీరోయిన్‌గా కియరా అద్వానీ.. ?

బాలీవుడ్ బ్యూటీలలో కియారా అద్వానీకి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆమె తన కెరియర్ ను మొదలుపెట్టి దాదాపు పదేళ్లు అవుతోంది. ఈ పదేళ్లలో ఆమె తనకి నచ్చిన కథలను .. పాత్రలను చేస్తూ వెళుతోంది. మహేశ్ బాబు సరసన నాయికగా ఆమె ‘భరత్ అనే నేను’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత చరణ్ తో ‘వినయ విధేయ రామ’ చేసింది .. కానీ ఆ సినిమా ఫ్లాప్ అయింది.

హృతిక్ రోషన్ – ఎన్టీఆర్ కాంబినేషన్లో మల్టీస్టారర్ మూవీగా ‘వార్ 2’ రూపొందనున్న సంగతి తెలిసిందే. 2019లో సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన ‘వార్’ సినిమాకి ఇది సీక్వెల్. అయితే ఇప్పుడు ఈ సీక్వెల్ కి సిద్ధార్థ్ ఆనంద్ కాకుండా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమా కోసమే కియారాను తీసుకున్నారని టాక్. అయితే ఇద్దరు హీరోల్లో ఎవరి జోడీగా అనే విషయంలో క్లారిటీ రావలసి ఉంది. ఈ దీపావళి సందర్భంగా ఈ సినిమాను లాంచ్ చేయనున్నారనేది సమాచారం.

ఇక ఇప్పుడు కూడా ఆమె చరణ్ జోడీగా శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ చేస్తోంది. ఇది పాన్ ఇండియా సినిమా కావడంతో, కియారా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమా తరువాత ఆమె ఎన్టీఆర్ సినిమాలో కనిపించనుందనే టాక్ బలంగా వినిపిస్తోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్