Thursday, March 12, 2026
HomeTrending NewsYuva Galam: ప్రజావేదిక పునర్నిర్మిస్తాం: లోకేష్ సెల్ఫీ ఛాలెంజ్

Yuva Galam: ప్రజావేదిక పునర్నిర్మిస్తాం: లోకేష్ సెల్ఫీ ఛాలెంజ్

ప్రజా వేదిక శిథిలాలే జగన్ అరాచక ప్రభుత్వ పతనానికి సమాధి రాళ్ళు అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఈ ప్రభుత్వ విధ్వంసానికి  ప్రజావేదిక ప్రత్యక్షసాక్షిగా  నిలుస్తోందని వ్యాఖ్యానించారు. జగన్ కూల్చివేతల పర్వం ఇప్పటికీ కొనసాగుతూనే ఉందన్నారు.  ఈ ప్రభుత్వ 51 నెలల పాలనలో గూడు కోల్పోయిన లక్షలాది పేదల కన్నీరు దావానలంలా మారి ఈ ప్రభుత్వాన్ని కూల్చబోతోందని హెచ్చరించారు.

అధికారంలోకి రాగానే ప్రజా వేదిక పునర్నిర్మిస్తామని లోకేష్ ప్రకటించారు. జగన్ పాలనను తిరస్కరిస్తూ ప్రజలు ఇవ్వబోయే తీర్పుతో ప్రజా ప్రభుత్వం ఏర్పడబోతోందని,  ఇంకా తొలగించని ఈ శిథిలాల సాక్షిగా సరికొత్త ప్రజావేదికను నిర్మిస్తామని చెప్పారు.

లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్ర నేడు కృష్ణా జిల్లాలోకి ప్రవేశించింది. అంతకుముందు ప్రజా వేదిక వద్ద లోకేష్ సెల్ఫీ దిగి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular