మంత్రి కేటీఆర్ సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నారు. తంగళ్లపల్లి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. తంగళ్లపల్లి మండలం చీర్లవంచలో సబ్స్టేషన్ ప్రారంభించారు. ఎస్సీ కమ్యూనిటీ హాల్ కు శంకుస్థాపన చేశారు. గ్రామంలో అంబేద్కర్, చాకలి ఐలమ్మ విగ్రహాలను ఆవిష్కరించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. 350 ఎకరాలలో ఆక్వా హబ్ ఏర్పాటు చేయనున్నామని, అందులో స్థానిక పిల్లలకే ఉద్యోగావకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. చీర్లవంచ నుంచి వలస పోయినవాళ్లంతా వాపస్ వస్తున్నారని చెప్పారు. గ్రామంలో జూనియర్ కాలేజీని ఏర్పాటు చేసుకుందామన్నారు.


