Sunday, September 8, 2024
HomeTrending Newsనిమ్స్ సందర్శించిన మంత్రులు  

నిమ్స్ సందర్శించిన మంత్రులు  

కరోనా బారిన పడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ భరోసా ఇచ్చారు.  మంగళవారం  మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హోంమంత్రి మహమూద్ అలీ లు నిమ్స్, ఎర్రగడ్డ లోని చేస్ట్ హాస్పిటల్స్ ను సందర్శించారు.

మొదటగా నిమ్స్స్ ఆసుపత్రిలోని ట్రామా బిల్డింగ్ లోని కోవిడ్ సెంటర్ లో కరోనా వైద్యసేవలు పొందుతున్న వారిని పరామర్శించి ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవల గురించి వాకబు చేశారు. ప్రతిరోజూ ఇక్కడికి వచ్చే కరోనా బాధితులకు ఆక్సిజన్, వెంటిలేటర్ సదుపాయం తదితర సౌకర్యాల పై వాకబు చేశారు. దాదాపు 250 మందికి వైద్యసేవలు అందిస్తున్నట్లు, అవసరమైన మేరకు బెడ్స్ ను పెంచుకునే సామర్ధ్యం ఉందని నిమ్స్ డైరెక్టర్ మనోహర్ మంత్రులకు వివరించారు.

అనంతరం ఎర్రగడ్డ లోని చెస్ట్ హాస్పిటల్ ను సందర్శించారు. ఆయా హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్న 17 మంది కరోనా చికిత్స పొందుతున్న వారి వద్దకు మంత్రులు వెళ్ళి చికిత్స అందుతున్న తీరు, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.  ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవల పట్ల బాధితులు సంతృప్తి వ్యక్తం చేశారు. తమ ప్రాణాలను ఫణంగా పెట్టి నిరంతరం సేవలు అందిస్తున్న వైద్యులు, సిబ్బంది ని మంత్రులు ఈ సందర్భంగా  ప్రశంసించారు.

ఎర్రగడ్డ లోని చెస్ట్ హాస్పిటల్ లో CT స్కాన్, అల్ట్రా సౌండ్ పరికరాలు అవసరం ఎంతో ఉందని హాస్పిటల్ సూపరింటెండెంట్ మహబూబ్ ఖాన్ మంత్రి దృష్టికి తీసుకురాగా, వెంటనే వాటి ఏర్పాటుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారు. అవసరమైన ప్రతిపాదనలు  వెంటనే అందజేయాలని అక్కడే ఉన్న TSMIDC CE రాజేంద్ర కుమార్ ను మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ లు మాట్లాడుతూ కరోనా మహమ్మారి నియంత్రణ కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలతో సత్ఫలితాలు వస్తున్నాయని, కేసుల సంఖ్యా చాలా తగ్గిందని చెప్పారు.  హాస్పిటల్స్ లో ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని వాటి పరిష్కారానికి చర్యలను చేపడుతున్నట్లు చెప్పారు.

నిమ్స్ హాస్పిటల్ లో 1060 మంది కోవిడ్ చికిత్సకోసం చేరగా, ప్రస్తుతం 127 మంది చికిత్స పొందుతున్నారని, మిగిలిన వారు కోలుకొని డిశ్చార్జి అయినారని వైద్యులు మంత్రులకు వివరించారు. అదేవిధంగా  చెస్ట్ హాస్పిటల్ లో 1375 మంది కరోనా చికిత్స కోసం చేరగా, 1000 మందికి పైగా కోలుకొని డిశ్చార్జి అయినట్లు అక్కడి వైద్యులు వివరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్