Wednesday, March 11, 2026
HomeTrending Newsముఖ్యమంత్రులకు కెసిఆర్ అల్పాహార విందు

ముఖ్యమంత్రులకు కెసిఆర్ అల్పాహార విందు

ఖమ్మంలో నిర్వహించనున్న బీఆర్‌ఎస్‌ (భారత్‌ రాష్ట్ర సమితి) పార్టీ ఆవిర్భావ సభకు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ నేతలు, రైతు ప్రతినిధులు ఇప్పటికే హైదరాబాద్‌ చేరుకున్నారు. బుధవారం ఉదయం వీరంతా ప్రగతిభవన్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా జాతీయ నేతలకు సీఎం కేసీఆర్‌ అల్పాహార విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌, కేరళ సీఎం పినరయి విజయన్‌, యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌, సీపీఐ నేత డి. రాజా సహా పలువురు నేతలు పాల్గొన్నారు.

National Leaders Pragathi Bhavan

అల్పాహార విందు సమావేశం అనంతరం వీరంతా సీఎం కేసీఆర్‌తో కలిసి యాదాద్రి బయలుదేరి వెళ్లనున్నారు. అక్కడ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఈ సందర్భంగా యాదాద్రిలో ముఖ్యమంత్రుల పర్యటనకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఆలయాన్ని పూలు, తోరణాలతో సుందరంగా అలంకరించారు. సీఎంల కోసం ఆలయంలో ప్రత్యేక ప్రసాదాలు, జ్ఞాపికలను సిద్ధంగా ఉంచారు. మరోవైపు యాదాద్రిలో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. సుమారు 1600 పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular