Friday, September 20, 2024
HomeTrending Newsదద్దమ్మలు చేసే తప్పుడు ప్రచారం: ధర్మాన

దద్దమ్మలు చేసే తప్పుడు ప్రచారం: ధర్మాన

భూములపై కొత్త టైటిలింగ్ యాక్ట్ తీసుకురావాలన్నది కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమని దీన్ని తాము అమలు చేయబోమని ఎప్పుడో చెప్పామని రాష్ట్ర రెవిన్యూ శాఖా మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ చట్టంపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు.

ఈ చట్టాన్ని అమలు చేయాలంటూ రాష్ట్రాలపై కేంద్రం ఒత్తిడి తీసుకువస్తూనే ఉందని, అలాంటి పార్టీతోనే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జట్టుకట్టిందని  అన్నారు.  ఇప్పుడు టైటిలింగ్ యాక్ట్ పై టిడిపి నేతలు వక్రభాష్యాలు చెప్తున్నారని విమర్శించారు. దేశవ్యాప్తంగా ఈ చట్టంపై ఏకాభిప్రాయం వచ్చి, న్యాయ స్థానాల్లో దాఖలైన పిటిషన్లపై తీర్పులు తర్వాత మాత్రమే దీనిపై ఆలోచన చేస్తామని, అంతవరకూ దీన్ని అమలుచేసే ప్రసక్తే లేదని, ఈ విషయాన్ని స్పష్టం చేసినా దీనిపై దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు.

రైతులకు మేలు చేసేలా అనేక సంస్కరణలు చేశామని, సమగ్ర సర్వేద్వారా ఎంతో మేలు చేకూరుతోందని వివరించారు. అత్యాధునిక టెక్నాలజీని సర్వేకోసం వినియోగించామని,  దీనివల్ల రికార్డులు అప్ టు డేట్ గా ఉంటాయని పేర్కొన్నారు. పరిపాలన వికేంద్రకరణ వల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరాయని,  గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ కార్యాలయాలు వస్తాయని,  మొత్తం కంప్యూటరీకరణ జరిగి ఆటోమేటిగ్గా మ్యుటేషన్ జరుగుతుందని చెప్పారు.

ధర్మాన మాట్లాడిన ముఖ్యాంశాలు:

  • రైతుల కోసం ఇంత చేస్తుంటే.. తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు చేతకాని దద్దమ్మలు చేసే తప్పుడు ప్రచారాలు ఇవి
  • రైతులకోసం ఏరోజూ ఆలోచించని దద్దమ్మలు ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారు
  • జగన్ భూములు తీసుకునేవాడా? భూములు పంచేవాడా? ఈ ఐదేళ్ల పాలనే చెప్తుంది
  • 26 లక్షల ఎకరాలపై నిరుపేదలకు సర్వహక్కులు కల్పించింది జగన్ కాదా?
  • అలాంటి జగన్ మీకు భూములు తీసుకునేవాడిలా కనిపిస్తున్నాడా?
  • స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఇంత గొప్ప నాయకుడు ఎక్కడైనా ఉన్నాడా?
  • చుక్కల భూములను నిరుపేద రైతులకు పంచితే జగన్… మీకు భూములు లాక్కునేవాడిలా కనిపిస్తున్నాడా?
  • 31 లక్షల ఇళ్లపట్టాలు ఇచ్చిన జగన్ మీకు భూమిని లాక్కునేవాడిలా కనిపిస్తున్నాడా?
  • రాష్ట్రంలో ప్రజలంతా అమయాకులని అనుకుంటున్నారా? మీరేం చెప్తే అది నమ్ముతారన్న భ్రమలో ఉన్నారా?
  • మీ చేతిలో ఉన్నవి ఎల్లోమీడియా మాత్రమే? కాని ప్రజల చేతిలో ఫోన్ల రూపంలో కోట్లాది ఛానల్స్ ఉన్నాయి
  • నిజాలను వారే అందరికీ వివరిస్తారు, ప్రజల భూములు తీసుకుని వ్యాపారాలు తీసుకునే భావజాలం టీడీపీది
  • భూములను నిరుపేదలకు పంచాలన్న భావజాలం జగన్ ది
  • చెప్పుకోవడానికి ఏమీ లేక ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, దీనిపై ఏ వేదికపైనైనా వచ్చి చర్చకు నేను సిద్ధం
  • రైతులకు అనుకూల నిర్ణయలు తప్ప, ఒక్క వ్యతిరేక నిర్ణయాన్నీ తీసుకోలేదు. దొంగరాతలు, తప్పుడు ప్రచారాలు మానండి
RELATED ARTICLES

Most Popular

న్యూస్