తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. తాజాగా మరో భారీ పెట్టుబడి వచ్చింది. ఆరిజెన్ ఫార్మా సంస్థ హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ ఫార్మా సంస్థ జీనోమ్ వ్యాలీలో 40 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది. 250 మందికి పైగా ఉపాధి కల్పించనుంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో బయో మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేయనుంది.


