Tuesday, September 17, 2024
Homeసినిమాప్రభాస్ మారుతితో మూవీ చేస్తున్నాడా..?

ప్రభాస్ మారుతితో మూవీ చేస్తున్నాడా..?

Mirchi-Maruthi: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ న‌టించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్. ఈ భారీ చిత్రానికి జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ద‌ర్శక‌త్వం వ‌హించారు. ఈ భారీ పిరియాడిక్ మూవీ రిలీజ్ కి రెడీగా ఉంది. సంక్రాంతికి రావాల్సిన రాధేశ్యామ్ క‌రోనా థ‌ర్డ్ వేవ్ కార‌ణంగా వాయిదా ప‌డింది. మార్చిలో రాధేశ్యామ్ ప్రేక్షకుల ముందుకు రానున్నట్టుగా వార్తలు వ‌స్తున్నాయి. అయితే… అఫిషియ‌ల్ గా ఇంకా అనౌన్స్ చేయ‌లేదు.

ప్రభాస్ రాధేశ్యామ్ తో పాటు స‌లార్, ఆదిపురుష్‌, ప్రాజెక్టె కె, స్పిరిట్ చిత్రాలు చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే… తాజాగా యూత్ ఫుల్ చిత్రాల ద‌ర్శకుడు మారుతితో ప్రభాస్ ఓ ఫ్యామిలీ స్టోరీ చేసేందుకు ఓకే చెప్పాడ‌ని స‌మాచారం. ఈ ప్రాజెక్ట్ గురించి గ‌త కొన్ని రోజులుగా వార్తలు వ‌స్తూనే ఉన్నాయి. ఇదే విష‌యం గురించి గ‌తంలో మారుతిని అడిగితే… ప్రభాస్ తో ఎవ‌రైనా సినిమా చేయాల‌నుకుంటారు. అలాగే నేను కూడా చేయాలి అనుకుంటున్నాను కాక‌పోతే… ఆయన చేయ‌ద‌గ్గ క‌థ రెడీ అయిన‌ప్పుడు చెబుతానన్నాడు మారుతి.

ఇప్పుడు అంతా కుదిరింద‌ని… వీరిద్దరి కాంబినేష‌న్లో మూవీ సెట్ అయ్యింద‌ని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఆర్ఆర్ఆర్ ప్రొడ్యూస‌ర్ డివివి దానయ్య, ఆచార్య ప్రొడ్యూస‌ర్ నిరంజన్ రెడ్డి సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మించ‌నున్నారని తెలిసింది. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న భారీ సినిమాల గ్యాప్ ల్లో ఈ సినిమాను ఫినిష్ చేయాలన్నది ఆలోచన. రాజా డీలక్స్ అనే డిఫరెంట్ టైటిల్ లో ఈ సినిమా తెరకెక్కించ‌నున్నార‌ని టాక్ వినిపిస్తోంది. అయితే.. ఇది వాస్తవ‌మేనా…?  కాదా..? అనేది తెలియాల్సివుంది.

Also Read : ప్ర‌భాస్ మ‌రో రెండు సినిమాల‌కు ఓకే చెప్పాడా..?

RELATED ARTICLES

Most Popular

న్యూస్