Tuesday, March 10, 2026
HomeTrending Newsకేసియార్ కు ప్రకాశం టిడిపి ఎమ్మెల్యేల లేఖ

కేసియార్ కు ప్రకాశం టిడిపి ఎమ్మెల్యేల లేఖ

ప్రకాశం జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు కు లేఖ రాశారు. వెలిగొండ ప్రాజెక్టుపై కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు రాసిన లేఖపై పునఃసమీక్షించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టుపై చేసిన ఫిర్యాదును వెంటనే వెనక్కు తీసుకోవాలని కోరారు.

వెలిగొండకు అనుమతులు లేవని తెలంగాణ ప్రభుత్వం ఎందుకు భావిస్తోందని లేఖలో ప్రశ్నించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ లో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రస్తావన లేకపోవడం పూర్తిగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ వైఫల్యమేనని ఆరోపించిన ఎమ్మెల్యేలు, ఈ తప్పిదాన్ని సాకుగా చూపి ప్రాజెక్టుపై ఫిర్యాదు చేయడం సబబు కాదని అభిప్రాయపడ్డారు.  అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివ రావు, కొండపి ఎమ్మెల్యే బాల వీరంజనేయులు ఈ మేరకు లేఖ రాశారు.

2014  ఆంధ్ర ప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం అనుమతి ఇచ్చిన ప్రాజెక్టుల్లో వెలిగొండ ఉందని, ఈ విషయమై అనవసరంగా గందరగోళం సృష్టించి ప్రకాశం జిల్లా ప్రజల ప్రయోజనాలను దెబ్బతీయవద్దని వారు లేఖలో కోరారు. నిత్యం కరవుతో అల్లాడే తమ జిల్లాపై కక్ష వద్దని వారు విజ్ఞప్తి చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular